ఖాట్మండు : ఎవరెస్టు శిఖరంపై ఇద్దరు విదేశీ అధిరోహికులు మృతి చెందారు. ఒకరు అమెరికాకు చెందిన వ్యక్తి కాగా, మరొకరు స్విట్జర్లాండ్కు చెందిన అధిరోహికుడు. వీరిద్దరూ అలసటతో మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. ఎవరెస్టు శిఖరంపైకి ఎక్కిన తర్వాత స్విట్జర్లాండ్ అధిరోహికుడు, హిల్లరీ క్యాంపు అమెరికా అధిరోహికుడు మృతి చెందారు. గత వారం 30 మందికి పైగా అధిరోహికులు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికి మాత్రమే పాజిటివ్గా నిర్ధారణ అయింది. వీరందరిని బేస్ క్యాంపు నుంచి తరలించారు.
ఇవి కూడా చదవండి..