న్యూఢిల్లీ : జపాన్ టోక్యోలో జరుగనున్న ఒలిపింక్స్కు తొలిసారిగా భారత్ నుంచి మహిళా స్విమ్మర్ మానాపటేల్ అర్హత సాధించింది రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. యూనివర్సాలిటీ కోటా కింద మానా ఈవెంట్లో పాల్గొననుంది. ఒలింపిక్స్కు అర్హత పొందిన తొలి భారత మహిళ స్విమ్మర్ కావడం విశేషం. శ్రీహరి నటరాజన్, సజన్ ప్రకాశ్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో భారత స్విమ్మర్ మానాపటేల్. ఈ సందర్భంగా మానా పటేల్ను కేంద్ర మంత్రి అభినందించారు. అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శుభాకాంక్షలు తెలిపింది. బెల్గ్రేడ్ వేదికగా ఇటీవల జరిగిన వంద మీటర్ల ఈత పోటీల్లో మానా పటేల్ జాతీయ రికార్డు నెలకొల్పింది.