న్యూఢిల్లీ : దేశంలో రెండో రోజుల విరామం అనంతరం పెట్రోల్ రేట్లు శుక్రవారం మరోసారి పైకి కదిలాయి. అయితే, డీజిల్ రేట్లను మాత్రం చమురు కంపెనీలు పెంచలేదు. ఇప్పటికే దేశంలో రికార్డు స్థాయికి పెట్రోల్ ధరలు చేరగా.. తాజాగా 35 పైసలు పెరిగింది. పెంచిన ధరతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రేటు రూ.100కు చేరువైంది. ప్రస్తుతం రూ.99.16 ధర పలుకుతోంది. డీజిల్ రూ.89.15కు పెరిగింది. ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్ రూ.105.24, డీజిల్ రూ.96.72కు చేరింది. దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెట్రోల్ రూ.100 మార్క్ను దాటింది.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, ఒడిశా, లడఖ్, బీహార్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో వంద మార్క్ను దాటింది. డీజిల్ రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్లోని పలు రాష్ట్రాల్లో డీజిల్ రూ.100 దాటింది. మే 4వ తర్వాత ఇప్పటి వరకు పెట్రోల్ ధరలు వరుసగా 33వ సార్లు పెరిగాయి. పాక్కు సమీపంలో ఉన్న రాజస్థాన్ శ్రీగంగానగర్లో ఫిబ్రవరిలో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్ను దాటగా.. ప్రస్తుతం దేశంలోనే అత్యధిక ధర ఇక్కడే పలుకుతోంది. లీటర్ పెట్రోల్ ధర రూ.110.40కు చేరగా.. డీజిల్ రూ.102.42కు పెరిగింది. వరుసగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలతో వాహనదారులు బంకులు వెళ్లాలంటేనే జంకుతున్నారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు
ఢిల్లీలో పెట్రోల్ రూ.99.16.. డీజిల్ రూ.89.18
ముంబైలో పెట్రోల్ రూ.105.24.. డీజిల్ రూ.96.72
కోల్కతా పెట్రోల్ రూ.99.04.. డీజిల్ రూ.92.03
చెన్నైలో పెట్రోల్ రూ.100.13.. డీజిల్ రూ.93.72
బెంగళూరులో పెట్రోల్ రూ.102.48.. డీజిల్ రూ.94.54
హైదరాబాద్లో పెట్రోల్ రూ.103.05.. డీజిల్ రూ.97.20
విజయవాడలో పెట్రోల్ రూ.105.17 డీజిల్ రూ.98.73
తిరువనంతపురంలో పెట్రోల్ రూ.101.14, డీజిల్ రూ.95.74
జైపూర్లో రూ.105.91.. డీజిల్ రూ.98.29
పాట్నాలో పెట్రోల్ రూ.101.21.. డీజిల్ రూ.94.52
చండీగఢ్లో పెట్రోల్ రూ.95.36.. డీజిల్ రూ.88.81
భోపాల్లో రూ.107.43.. డీజిల్ రూ.97.93
భువనేశ్వర్లో పెట్రోల్ రూ.99.95.. డీజిల్ రూ.97.19
శ్రీనగర్లో పెట్రోల్ రూ.102.11.. డీజిల్ రూ.92.80