హైదరాబాద్ : నగరంలో మెట్రో రైలు వేళలను అధికారులు మరో 45 నిమిషాలు పెంచారు. లాక్డౌన్ తర్వాత ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు రైళ్లు నడుస్తున్నాయి. కరోనా కేసులు తగ్గి ప్రయాణికుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో వేళల్లో మెట్రో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. శుక్రవారం నుంచి రాత్రి 9.45 గంటల వరకు సర్వీసులు నడువనున్నాయి. చివరి రైలు 10.45 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుందని హెచ్ఎంఆర్ అధికారులు పేర్కొన్నారు.