న్యూఢిల్లీ : దేశంలో టీకా డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతున్నది. మొత్తం టీకాల పంపిణీ 34కోట్లకు చేరువైంది. ప్రస్తుతం ఉన్న తాతాల్కిక సమాచారం మేరకు 33,96,28,356 డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది. వ్యాక్సినేషన్ డ్రైవ్ 167వ రోజుకు చేరగా.. గురువారం రాత్రి 7 గంటల వరకు ఒకే రోజు 38,17,661 డోసులు అందించినట్లు కేంద్ర కుటుంబ, మంత్రిత్వశాఖ తెలిపింది. 18-44 సంవత్సరాల కేటగిరిలో 21,80,915 మందికి మొదటి, 84,107 మందికి రెండో మోతాదు అందజేసినట్లు చెప్పింది. మూడో విడుత ప్రారంభమైన నాటి నుంచి దేశవ్యాప్తంగా 9,38,32,139 మందికి మొదటి, 22,68,517 మందికి రెండో మోతాదు వేసినట్లు వివరించింది.