హైదరాబాద్ : నగరంలోని రాజేంద్రనగర్ ప్రేమావతినగర్ కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. ఇంటి ఎదుట నిలబడి ఉన్న బాలుడిపైకి దూసుకువెళ్లింది. దీంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. పరిస్థితి విషమంగా ఉన్నది. అయితే మద్యం మత్తులో డ్రైవర్ కారు నడపడమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో కోపోద్రిక్తులైన స్థానికులు మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ను చితకబాదారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.