న్యూఢిల్లీ: నూతన ఐటీ నిబంధనల అమలు విషయమై కేంద్ర ప్రభుత్వానికి, ట్విట్టర్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుతో సహా ఆరెస్సెస్ చీప్ మోహన్ భగవత్, పలువురు సంఘ్ నేతల ఖాతాలు అన్ వెరిఫైడ్ అంటూ ట్విట్టర్ వాటి నుంచి బ్లూ టిక్ తొలగించింది. ఈ విధానం అమలులో ట్విట్టర్ తీరుపై సందేహాల నీలి నీడలు కమ్ముకున్నాయి.
మోహన్ భగవత్తోపాటు ఆరెస్సెస్ నేతలు అరుణ్ కుమార్, సురేశ్ జోషి తదితరుల ఖాతాలపై బ్లూ టిక్ తొలగించి వేసింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో వారి ఖాతాల బ్లూ టిక్లను పునరుద్ధరించింది.
చాలా కాలంగా ఈ ఖాతాలు యాక్ట్వ్గా లేవని ట్విట్టర్ వివరణ ఇచ్చింది. కానీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు గానీ, ఆర్సెసెస్ నేతలకు గానీ సమాచారం ఇవ్వకుండానే వారి ఖాతాల బ్లూ టిక్ తొలగించి వేసింది.
కానీ మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్, సినీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఖాతాలు ఇప్పటికీ బ్లూ టిక్తో వెరిఫైడ్గా కొనసాగుతున్నాయి. గమ్మత్తేమిటంటే గతేడాది ఆగస్టులో ప్రణబ్ దా తన మరణానికి ముందు చివరిసారి ట్వీట్ చేశారు.
గతేడాది అక్టోబర్ నుంచి అహ్మద్ పటేల్ ఖాతా యాక్టివ్గా లేదు. గతేడాది మే నుంచి ఇర్ఫాన్ ఖాతాలో ట్వీట్లు లేవు. ఈ ఖాతాలు మెమోరియల్ ఖాతాలుగానూ వాడటం లేదు. ఈ నేతల మరణం తర్వాత వారి వారసత్వంగా వారి కుటుంబాలు కొనసాగించడం లేదు.
టీవీ యాంకర్ రోహిత్ సర్దానా ఖాతాను ఆయన కుటుంబం నిర్వహిస్తున్నది. అనవసర వివాదాలు తలెత్తకుండా సర్దానా భార్య ప్రమీల ఆయన వారసత్వాన్ని స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి సుష్మ స్వరాజ్ ఖాతాను బేటీ బన్సూరీ నిర్వహిస్తూ అప్డేట్స్ అందిస్తున్నది.
జూన్ 30 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ను పొడిగించిన పేటీఎం…
ఎస్బీఐ కస్టమర్లకు గమనిక.. ఆ పత్రాలు సమర్పిస్తేనే సేవలు
రాష్ట్ర ప్రభుత్వానికి 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు
తమిళనాడులో మరో వారం లాక్డౌన్ పొడగింపు
చరిత్రలో ఈరోజు : ఐదుగురిలో తొలిసారి ఎయిడ్స్ గుర్తింపు
ట్విటర్కు చివరి హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం
కొవిడ్ కిట్ లో కరోనిల్ : పతంజలి ప్రతిపాదన వ్యతిరేకించిన ఐఎంఏ
ఢిల్లీ అన్లాక్.. సరి, భేసి విధానంలో మాల్స్, మార్కెట్లకు అనుమతి
వెంకయ్య ఖాతాకు బ్లూటిక్ రీస్టోర్ చేసిన ట్విటర్
జైసల్మేర్ జిల్లాలో పవర్గ్రిడ్ ఆక్సిజన్ ప్లాంటు…
ఆరెస్సెస్ చీఫ్ భగవత్ ట్విట్టర్ బ్లూటిక్ రిమూవ్, అయితే!
ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ చార్జీలు.. ఏ బ్యాంకులో ఎంత అంటే …?
జొమాటో టార్గెట్: 9 ఏండ్లలో పూర్తిగా విద్యుత్ వాహనాలవైపు!!
భారత్-చైనా మధ్య ఏ శక్తి జోక్యం వద్దు : పుతిన్