ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 4: ఇంజినీరింగ్ విద్యార్థులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవమానకరమని, వాటిని ఖండిస్తున్నామని బీఆర్ఎస్వీ తెలిపింది. మంగళవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ ఓయూ నాయకుడు నాగేందర్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు ఉద్యోగ అప్లికేషన్ కూడా నింపలేరంటూ సీఎం రేవంత్రెడ్డి పేర్కొనడంపై మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రాజెక్టులు, రహదారులు, వంతెనలు, సాగునీటి పథకాలు, టెక్నాలజీ ఇలా ఏ రంగం చూసినా ఇంజినీర్ల పాత్ర ఎంతో ఉన్నదని గుర్తుచేశారు. తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.