హైదరాబాద్ ,జూన్ 5: కరోనా నేపథ్యంలో పర్సనల్ వెహికిల్స్ కు డిమాండ్ బాగా పెరుగుతున్నది. ఈ ప్రభావంతో హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మరోసారి షైన్ బైక్ ధర పెంచింది. భారతదేశంలో బ్రాండ్ అత్యధిక సేల్స్ ఉన్న వాటిలో హోండా షైన్ ఒకటి. అయితే కంపెనీ గత రెండు నెలల్లో ఏకంగా దీని ధరను రెండుసార్లు పెంచింది.
భారతీయ మార్కెట్లో హోండా షైన్ బైక్, డ్రమ్ బ్రేక్ అండ్ డిస్క్ బ్రేక్ రెండు వేరియంట్లలో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ పెంచిన ధరలతో హోండా షైన్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 71,550 ఉండగా, డిస్క్ వేరియంట్ ధర రూ. 76,346 కు చేరింది. ఈ ధరలు ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ప్రకారం నిర్ణయించడం జరిగింది. అయితే షైన్ బైక్పై హోండా మోటార్ సైకిల్ కంపెనీ క్యాష్బ్యాక్ ఆఫర్ను కూడా అందిస్తోంది. కొత్త షైన్ బైక్ కొనుగోలు చేసినప్పుడు వినియోగదారులకు దీనిపై ఇప్పుడు 5% క్యాష్బ్యాక్ ఆఫర్ పొందవచ్చు. కానీ దీనికి నిబంధనలు మరియు షరతులు ఉన్నాయి. కొనుగోలుదారులు దీనిని గమనించాలి.