న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అకౌంట్కు బ్లూటిక్ రీస్టోర్ చేసింది ట్విటర్. దానిని తొలగించిన గంటల వ్యవధిలోనే ఈ మైక్రోబ్లాగింగ్ సంస్థ రీస్టోర్ చేయడం గమనార్హం. గతేడాది జులై నుంచి ఈ అకౌంట్ ఇన్యాక్టివ్గా ఉందంటూ శనివారం ఉదయం వెరిఫైడ్ అకౌంట్ను సూచించే బ్లూటిక్ను ట్విటర్ తొలగించింది. అయితే దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ట్విటర్ దిగి వచ్చింది. ఈ మధ్య తన అధికారిక ఖాతాను ఆయన ఎక్కువగా వినియోగిస్తుండటంతో వ్యక్తిగత ఖాతా ఇన్యాక్టివ్గా ఉన్నదని ఉపరాష్ట్రపతి కార్యాలయం తెలిపింది.
వెంకయ్యనాయుడు ట్విటర్ అకౌంట్కు బ్లూటిక్ తీసేయడాన్ని కొందరు ట్విటరర్లు ప్రశ్నించారు. ఎన్నో ఖాతాలు ఏడాదికిపైగా ఇన్యాక్టివ్గా ఉన్నా.. వాటికి బ్లూటిక్ కొనసాగడాన్ని గుర్తు చేశారు. అటు బీజేపీ నేత సురేశ్ నకువా కూడా దీనిపై విమర్శలు గుప్పించారు. ఇది భారత రాజ్యాంగంపై జరిగిన దాడి అని ఆయన అనడం విశేషం.