న్యూఢిల్లీ: గత ఆరు నెలలుగా అన్ వెరిఫయింగ్ ఇన్ యాక్టివ్గా ఉన్న ఖాతాలకు మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ బ్లూ టిక్ తొలగించింది. ఈ క్రమంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరుల ఖాతాల బ్లూ టిక్ను తొలగిస్తున్నట్లు తెలిపింది. అయితే, తర్వాత ఉపరాష్ట్రపతి వెంకయ్య ఖాతా బ్లూటిక్ను పునరుద్ధరించింది.
మోహన్ భగవత్తోపాటు ఆరెస్సెస్ నేతలు అరుణ్ కుమార్, సురేశ్ సోనీ ఖాతాల బ్లూ టిక్ను కూడా తొలగించింది. ఇన్ యాక్టివ్గా ఉన్న ఖాతాలకు బ్లూ వెరిఫైడ్ బ్యాచ్ బ్లూటిక్ను తొలగిస్తుందని వివరణ ఇచ్చింది.
ఒకవేళ సుదీర్ఘ కాలం లాగిన్ కాకుంటే, ఆ ఖాతాను పూర్తిగా తొలిగించి వేస్తారు. ట్విట్టర్ యూజర్ ఖాతాను నిరంతరం మేనేజ్మెంట్ తనిఖీ చేస్తూ ఉంటుంది.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ ఖాతా బ్లూ టిక్ను తర్వాత పునరుద్ధరించినా, ఆరెస్సెస్ నేతల ఖాతాలను ఇంకా పునరుద్ధరించాల్సి ఉంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
గతేడాది జూలై 23వ తేదీన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చివరిసారిగా తన వ్యక్తిగత ఖాతాలో పోస్ట్ చేశారు. ఆరెస్సెస్ నేతలు ఒక్క ట్వీట్ కూడా చేయలేదు.
జూన్ 30 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ను పొడిగించిన పేటీఎం…
రాష్ట్ర ప్రభుత్వానికి 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు
తమిళనాడులో మరో వారం లాక్డౌన్ పొడగింపు
చరిత్రలో ఈరోజు : ఐదుగురిలో తొలిసారి ఎయిడ్స్ గుర్తింపు
ట్విటర్కు చివరి హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం
కొవిడ్ కిట్ లో కరోనిల్ : పతంజలి ప్రతిపాదన వ్యతిరేకించిన ఐఎంఏ
ఢిల్లీ అన్లాక్.. సరి, భేసి విధానంలో మాల్స్, మార్కెట్లకు అనుమతి
వెంకయ్య ఖాతాకు బ్లూటిక్ రీస్టోర్ చేసిన ట్విటర్
జైసల్మేర్ జిల్లాలో పవర్గ్రిడ్ ఆక్సిజన్ ప్లాంటు…