హైదరాబాద్, జూన్ 4:ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటర్ మరోమారు దాతృత్వాన్ని చాటుకున్నది. కంపెనీకి చెందిన దాతృత్వ విభాగమైన హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్..రాష్ట్ర ప్రభుత్వానికి రూ.కోటి విలువైన 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతోపాటు 50 బిపాప్ మెషీన్లను విరాళంగా అందించింది. దీంతోపాటు ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ వద్ద ఆక్సిజన్ ప్లాంట్ను సైతం ఏర్పాటు చేయబోతున్నట్లు సంస్థ ప్రకటించింది.