సెయింట్ పీటర్స్బర్గ్ : భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శనివారం మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఇద్దరూ బాధ్యతాయుతమైన నాయకులు అని, ఒకరినొకరు పూర్తి గౌరవంతో చూస్తారని, వీరిద్దరూ తమ దేశాల మధ్య సమస్యలను పరిష్కరించుకోగల సామర్థ్యం కలిగి ఉన్నారని చెప్పారు. ఈ ప్రక్రియలో ఏ శక్తి జోక్యం చేసుకోకూడదని పుతిన్ నిర్మొహమాటంగా చెప్పారు.
క్వాడ్ లోని నాలుగు దేశాల సమూహంపై రష్యా బహిరంగ విమర్శల మధ్య పుతిన్ మాట్లాడుతూ.. ఏదైనా చొరవలో ఒక దేశం ఎలా పాల్గొనాలి అనే దానిని అంచనా వేయాలి. ఒక దేశం ఇతర దేశాలతో ఎంతవరకు సంబంధాలను పెంచుకోవాలో అంచనా వేయడం మన పని కాదు. ఏదేమైనా వ్యతిరేకంగా ఏకం కావడానికి ఎటువంటి భాగస్వామ్యం ఉండకూడదని అని అన్నారు. భారతదేశం క్వాడ్లో చేరడంపై అభిప్రాయం కోరగా పుతిన్ పైవిధంగా స్పందించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తమ ప్రభావాన్ని నియంత్రించడానికే క్వాడ్ (ఇండియా, యూఎస్, జపాన్, ఆస్ట్రేలియా) సమూహాన్ని రూపొందించినట్లు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఇటీవల చెప్పారు. భారత్-చైనా సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తత గురించి మాట్లాడుతూ.. ఇటువంటి సమస్యలు పొరుగు దేశాల మధ్య జరగడం సర్వసాధారణమని పేర్కొన్నారు.
టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మమత మేనల్లుడు
ఐరాస నివేదిక : అల్-ఖైదా అధినేత జవహరి బతికే ఉన్నాడు..
లినెథోల్మ్ ద్వీపం : సముద్ర మట్టం పెరగకుండా డెన్మార్క్ సృష్టి
ఔట్లుక్ నివేదిక : పర్యావరణ ప్రమాద జాబితాలో 43 నగరాలు మనవే..!
పర్యావరణ హితం : చెట్టుపై ఇల్లు కట్టిన ఐఐటీయన్
నెస్ట్-2021 దరఖాస్తు దాఖలు గడువు పొడగింపు
కరోనా ఎఫెక్ట్ : వైష్ణో దేవి యాత్రకు తగ్గిన భక్తులు
ప్రపంచ పర్యావరణ దినం: పీపీఈ కిట్ భూమిలో కరగడానికి 500 ఏండ్లు
చరిత్రలో ఈరోజు : ఐదుగురిలో తొలిసారి ఎయిడ్స్ గుర్తింపు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..