జైపూర్ : పర్యావరణాన్ని ప్రేమించడం అంటే మొక్కలు నాటడం ఒక్కటే కాదు. నాటిన మొక్కలను సంరక్షించడం కూడా. చెట్లను కాపాడినప్పుడే పర్యావరణ దినోత్సవాలకు సార్ధకత చేకూరుతుంది. ఈ మాటలను నమ్మిన ఉదయ్పూర్లోని ఐఐటీయన్.. ఒక్క కొమ్మను కూడా కత్తిరించకుండా మామిడిచెట్టుపై నాలుగు అంతస్థుల్లో ఇంటినే నిర్మించారు.
రాజస్థాన్లోని సరస్సుల నగరమైన ఉదయపూర్లోని ఈ ప్రత్యేకమైన ఇల్లు పర్యావరణ పరిరక్షణకు చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గత 20 సంవత్సరాలుగా ఇదే మామిడి చెట్టుపై నివసిస్తూ పర్యావరణ అవగాహనకు ఇంజినీర్ కేపీ సింగ్ ప్రత్యేకమైన ట్రీ హౌస్ నిర్మించాడు. ఇన్నేండ్లయినా చెట్టు, ఇల్లు రెండూ సురక్షింగంగానే ఉన్నాయి.
ఉదయపూర్ అందాలను చూడటానికి వచ్చే పర్యాటకులు ఈ ప్రత్యేకమైన ఇంటి వైపు కూడా ఆకర్షితులవుతారు. ఈ డ్రీమ్ హౌస్ నిర్మాణం సమయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక్క కొమ్మను కూడా కత్తిరించలేదంటే విచిత్రంగా ఉందికదూ..! కొన్ని కొమ్మలను సోఫాల మాదిరిగా తయారుచేయగా.. మరికొన్నింటికి టీవీ స్టాండ్ రూపం ఇచ్చారు.
చెట్టు కొమ్మల ప్రకారంగా ఇల్లు రూపొందించారు. కిచెన్, బాత్రూమ్, బెడ్ రూమ్, డైనింగ్ హాల్.. ఇలా సాధారణ భవనంలోని సకల సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. వంటగది, పడకగది మొదలైన వాటి నుంచి కొమ్మలు బయటకు వచ్చి కనిపిందు చేస్తాయి. ప్రతి సీజన్లో మామిడి పండ్లు చాలా కాస్తుండటంతో ఇంటి యజమానులు హాయిగా తింటూ ఆరోగ్యాన్ని పొందుతున్నారు.
నెస్ట్-2021 దరఖాస్తు దాఖలు గడువు పొడగింపు
కరోనా ఎఫెక్ట్ : వైష్ణో దేవి యాత్రకు తగ్గిన భక్తులు
ప్రపంచ పర్యావరణ దినం: పీపీఈ కిట్ భూమిలో కరగడానికి 500 ఏండ్లు
చరిత్రలో ఈరోజు : ఐదుగురిలో తొలిసారి ఎయిడ్స్ గుర్తింపు
కరోనా టైం: సప్లిమెంట్స్ నకిలీలను ఇలా కనిపెట్టండి..!
లాక్డౌన్ ఎఫెక్ట్ : పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం
కింగ్ కోబ్రా : శివాలిక్ కొండల్లో దర్శనం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..