IND vs Srilanka | గాలే వేదికగా ఇండియా- శ్రీలంక(IND vs Srilanka) మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా రెండో రోజు ఆట ఇంకా మెదులు కాలేదు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా వర్షం కారణంగా మైదానంలో కవర్లు కప్పి ఉంచారు. ప్రస్తుతం వర్షం ఆగిపోవడంతో మైదాన సిబ్బంది నీటిని తొలగించి ఆటను సిద్ధం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. మ్యాచ్ ప్రారంభం కావడానికికనీసం ఒక గంట సమయం పట్టేలా కనిపిస్తోంది.
కాగా, టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకొని 2 వికెట్ల నష్టానికి 288 పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది. ఉన్న దేవదత్ పడిక్కల్( 131), రిషబ్ పంత్ (27) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు యశస్వీ జైస్వాల్(32), శుభ్మన్ గిల్(16) పరుగులు చేసి ఔటయ్యారు. కేఎల్ రాహుల్(77) రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. మొదటి రోజు కూడా వరుణుడు ఆటకు ఆటంకం కలిగించడంతో 73 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఇంకా ఎనిమిది వికెట్లు చేతిలో ఉండటంతో, తమ తొలి ఇన్నింగ్స్ స్కోరును 500కు దగ్గరగా తీసుకెళ్లాలని భారత్ భావిస్తోంది. మరోవైపు, మ్యాచ్ తమ చేజారిపోకుండా ఉండాలంటే శ్రీలంకకు త్వరగా వికెట్లు పడగొట్టడం అవసరం.