న్యూఢిల్లీ : కరోనా వైరస్ ఉద్ధృతి కారణంగా ఈ నెల 14 న జరుపతలపెట్టిన జాతీయ ప్రవేశ స్క్రీనింగ్ పరీక్ష (నెస్ట్-2021) దరఖాస్తు దాఖలు గడువును జూలై 15 వరకు పొడిగించారు. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారిక వెబ్సైట్ nestexam.in లో సమాచారం ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం, జూన్ 14 న జరగాల్సిన పరీక్ష ప్రస్తుతానికి వాయిదా పడింది. పరీక్షను వాయిదా వేయడంతో పాటు దరఖాస్తు దాఖలు తేదీని జూలై 15 వరకు పొడిగించారు. అంతకుముందు దరఖాస్తు దాఖలుకు చివరి తేదీ జూన్ 07 గా ఉండేది.
ప్రస్తుతం, కొత్త పరీక్ష తేదీ గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. పరీక్ష తేదీలు త్వరలో ప్రకటిస్తారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, భువనేశ్వర్, ముంబై విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్) అవసరం. ఈ ప్రవేశ పరీక్షకు హాజరు కావాలంటే అభ్యర్థులు దేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో 12 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వు చేసిన వర్గాలకు సడలింపు ఉంటుంది.
కరోనా ఎఫెక్ట్ : వైష్ణో దేవి యాత్రకు తగ్గిన భక్తులు
ప్రపంచ పర్యావరణ దినం: పీపీఈ కిట్ భూమిలో కరగడానికి 500 ఏండ్లు
చరిత్రలో ఈరోజు : ఐదుగురిలో తొలిసారి ఎయిడ్స్ గుర్తింపు
కరోనా టైం: సప్లిమెంట్స్ నకిలీలను ఇలా కనిపెట్టండి..!
లాక్డౌన్ ఎఫెక్ట్ : పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం
కింగ్ కోబ్రా : శివాలిక్ కొండల్లో దర్శనం
ఐఐటీయన్ల ప్రతిభ : అందుబాటులోకి హై ఫ్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..