భోపాల్ : కరోనా వైరస్ కారణంగా ఆక్సిజన్ సరిగా అందక అవస్థలు పడుతున్న వారి కోసం ఐఐటీ భోపాల్కు చెందిన యువ శాస్త్రవేత్తల బృందం.. కొత్త రకం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను తయారు చేసింది. కేవలం నిమిషం సమయంలో 15 లీటర్ల ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే హైఫ్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటివరకు మార్కెట్లో లభించే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు నిమిషానికి 5-10 లీటర్ల ఆక్సిజన్ను మాత్రమే సరఫరా చేయగలవు. ఇవన్నీ కూడా చైనా, సింగపూర్ నుంచి దిగుమతి చేసుకున్నవే.
దేశంలో ఒక యువ స్టార్టప్ మేడ్ ఇన్ ఇండియా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అభివృద్ధి చేయడం ఇదే మొదటిసారి. ఇవి ప్రత్యేక ద్రవ శీతలీకరణ వ్యవస్థను కలిగి ఉండి.. ఇద్దరు, ముగ్గురికి 24×7 ఆక్సిజన్ సరఫరా చేస్తుండటం దీని ప్రత్యేకత. వీటి ధర రూ.1.66 లక్షలుగా నిర్ణయించారు. వీటిపై పరిశోధన చేయడానికి, ఉత్పత్తి చేయడానికి వీరు దాదాపు రూ.20 లక్షలు ఖర్చు చేశారు. మధ్యప్రదేశ్లోని కొన్ని గ్రామీణ ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా అందించేందుకు రూ.3.5 లక్షల క్రౌడ్ఫండింగ్ సాయం తీసుకున్నారు. ఢిల్లీ, హైదరాబాద్ లోని కొన్ని దవాఖానలకు కూడా వీరు తమ కాన్సన్ట్రేటర్లను పంపారు.
గత కొన్ని రోజులుగా కరోనా కారణంగా ఎందరో పడుతున్న ఇబ్బందులను చూసి కాన్సన్ట్రేటర్లను తక్కువ ఖర్చులో ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తి చేసేలా సిద్దం చేయాలనుకున్నామని గ్రూపు సభ్యుడు ఆకాశ్ గుప్తా తెలిపారు. ఇదే సమస్యతో తన తల్లిని కూడా కోల్పోయానని, ఇలాంటి బాధ మరెవ్వరికీ రాకూడదనే ఉద్దేశంతో మరికొందరు ఐఐటీయన్లతో కలిసి కొత్త రకం కాన్సన్ట్రేటర్ల తయారీకి సిద్ధపడ్డామని చెప్పారు. మాకు చేతనైనంత సంఖ్యలో కాన్సన్ట్రేటర్లను తయారుచేసి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు అందివ్వాలని అనుకుంటున్నామని పేర్కొన్నారు.
చైనా చరిత్రలో మరిచిపోలేని మరక.. చరిత్రలో ఈరోజు
మరింత గౌరవం : వోగ్ పత్రిక ముఖచిత్రంపై మలాలా
వయసు పెరుగుదల : కొత్త ప్రోటీన్ కనిపెట్టిన ఇజ్రాయెల్
ర్యాంకింగ్ విధానం : న్యూయార్క్ మేయర్ ఎన్నికలో అమలు
ఈకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ : 2023 ఏప్రిల్ నుంచి ఇథనాల్ పెట్రోల్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..