న్యూఢిల్లీ : పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఇథనాల్ కలిపిన పెట్రోల్ను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. కాలుష్యాన్ని తగ్గించడమేకాకుండా రైతులకు ప్రయోజనకరంగా నిలిచే ఇథనాల్ను పెట్రోల్లో కలిపి విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. రాబోయే రెండేండ్లలో పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని కలిపి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఖరీదైన చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దేశానికి సహాయపడుతుంది. తొలుత 2025 నాటికి దీనిని సాధించాలనే లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్నది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకారం, చమురు కంపెనీలు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రమాణాల ప్రకారం 20 శాతం ఇథనాల్ మిశ్రమంతో పెట్రోల్ను విక్రయిస్తాయి. ఈ విక్రయాలు 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
2022 నాటికి 10 శాతం ఇథనాల్ బ్లెండింగ్తో పెట్రోల్ను విక్రయించాలని భారత్ యోచిస్తున్నది. ఇందుకోసం సుమారు 4 బిలియన్ లీటర్ల ఇథనాల్ అవసరమవుతుంది. 2023 నాటికి 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించడానికి.. 10 బిలియన్ లీటర్ల ఇథనాల్ అవసరం. చక్కెర పరిశ్రమల నుంచి మిగులు చక్కెరను ఉపయోగించి 7 బిలియన్ లీటర్ల ఇథనాల్ తీస్తుండగా.. మిగిలిన ఇథనాల్ మిగులు ధాన్యాల నుంచి ఉత్పత్తి అవనున్నది.
ఇథనాల్ పర్యావరణ అనుకూల ఇంధనం. ఇథనాల్ ఒక రకమైన ఆల్కహాల్. ఇది పెట్రోల్తో కలిపి వాహనాల్లో ఇంధనంగా ఉపయోగిస్తారు. పెట్రోల్కు ఇథనాల్ జోడించడం వల్ల పెట్రోల్ వాడకం వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించవచ్చు. దీనిని ఉపయోగించి వాహనాలు 35 శాతం తక్కువ కార్బన్ మోనాక్సైడ్ను విడుదల చేస్తాయి. ఇథనాల్ సల్ఫర్ డయాక్సైడ్, హైడ్రోకార్బన్ల ఉద్గారాలను కూడా తగ్గిస్తుంది. ఇథనాల్లో ఉన్న 35 శాతం ఆక్సిజన్ కారణంగా ఈ ఇంధనం నత్రజని ఆక్సైడ్ల ఉద్గారాలను కూడా తగ్గిస్తుంది.
ఇథనాల్ వాడకాన్ని పెంచడం వల్ల రైతుల ఆదాయం కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇథనాల్ చెరకు, మొక్కజొన్న, అనేక ఇతర పంటల నుంచి తయారవుతుంది. ఇథనాల్ తీసేందుకు పెద్ద ఎత్తున చెరకు, మొక్కజొన్న పంటలు పండించేలా రైతులను ప్రోత్సహించి వారికి గిట్టుబాటు కల్పించవచ్చు. షుగర్ మిల్లులు సంపాదనకు కొత్త మార్గాలను పొందుతాయి. వీరి ఆదాయాలు కూడా పెరుగుతాయి.
ఫ్రెంచ్ ఓపెన్ : కరోనాతో డబుల్స్ ఆటగాళ్ళు అవుట్
సైకిల్ సవారీ-ఆరోగ్యానికి దారి.. నేడు వరల్డ్ సైకిల్ డే
భారత్ నుంచి పాకిస్తాన్ విభజన.. చరిత్రలో ఈరోజు
అంతరిక్ష కేంద్రంతో ఢీకొన్న శిధిలం.. రోబోటిక్ చేయికి నష్టం
అంగారకుడి ఆకాశంలో మేఘాలు.. క్యూరియాసిటీ రోవర్ ఫొటోలు
కరోనా వేళ అన్నదాతలుగా మారిన యాసిడ్ బాధితులు..
కొవిడ్ వేళ దేశం విడిచి వెళ్తున్న కోటీశ్వరులు.. ఎందుకిలా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..