లక్నో : కరోనా వైరస్ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో ఆగ్రాలోని యాసిడ్ బాధితులు అన్నదాతలుగా మారి పేదల కడుపు నింపుతున్నారు. ఆగ్రాలోని షీరోస్ హ్యాంగవుట్ కేఫ్ను నిర్వహిస్తున్న యాసిడ్ బాధిత మహిళలు.. కొవిడ్ లాక్డౌన్ సమయంలో అవసరమైన వారికి ఉచితంగా ఆహారం అందిస్తున్నారు.
ఆగ్రాలోని షీరోస్ హ్యాంగవుట్ కేఫ్ నిరుపేదలకు ఉచిత ఆహారాన్ని పంపిణీ చేస్తూ కొవిడ్ వేళ అండగా నిలుస్తున్నారు. ఈ కేఫ్ను యాసిడ్ బాధిత మహిళలే నడుపుతున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో తమ దుఃఖాన్ని మరచిపోయి ప్రజలకు సహాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మహమ్మారి కారణంగా గత ఏడాది నవంబర్లో మూసివేశారు. ఏడు నెలల తర్వాత కేఫ్ తిరిగి ప్రారంభమైంది. బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులతోపాటు చాలా మంది ప్రపంచ నాయకులు ఈ కేఫ్ను సందర్శించారు. లాక్డౌన్ కారణంగా ఈ కేఫ్ను మూసివేయడం వల్ల ఇక్కడ పనిచేసే మహిళలు భారీగా నష్టపోయారు.
యాసిడ్ బాధితులే నడుపుతున్న ఈ కేఫ్.. ఏటా ఇక్కడకు వచ్చే విదేశీ పర్యాటకులపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఈ కేఫ్ ద్వారా యాసిడ్ బాధిత మహిళలను స్వావలంబన చేయడానికి ప్రయత్నిస్తున్నానని షీరోస్ కేఫ్ వ్యవస్థాపకుడు ఆశిష్ శుక్లా చెప్పారు. గత ఏడాది కరోనా కారణంగా ఇక్కడికి వచ్చే వినియోగదారుల సంఖ్య 75 శాతం పడిపోయింది. ఈ కేఫ్లో పనిచేసి ఎంతో కొంత ఆర్జించడం తప్ప వేరే మార్గాలు లేని మహిళలు.. లాక్డౌన్తో తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. దాంతో ఉన్నతాధికారులకు విషయం విన్నవించి కేఫ్ను నడిపించేందుకు ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. అయితే, వినియోగదారులు రాకపోవడంతో.. నిరుపేదలకు అండగా నిలువాలన్న ఆలోచనతో నిత్యం పెద్ద సంఖ్యలో అన్నార్థులకు భోజనం అందిస్తున్నారు. వీరి సేవలో పలువురు దాతలు పాలుపంచుకుంటుండటంతో వీరి అన్నదానం నిర్విఘ్నంగా కొనసాగుతున్నది.
కొవిడ్ వేళ దేశం విడిచి వెళ్తున్న కోటీశ్వరులు.. ఎందుకిలా..?
తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది.. చరిత్రలో ఈరోజు
యూట్యూబర్లను పన్ను కిందకు తెచ్చిన అమెరికా
ఈ ఆరు లక్షణాలను అశ్రద్ధ చేయకండి
గొలుసుల్లో బంధించిన బాల్యం: ఆతృతతో తింటూ ఆరేండ్ల శరణార్థి కన్నుమూత
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..