భారతదేశం నుంచి పాకిస్తాన్ను విభజిస్తూ కొత్త దేశంగా 1947 లో సరిగ్గా ఇదే రోజున ప్రకటించారు. భారత్ నుంచి విడివడి నేటికి సరిగ్గా 74 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ విభజన ప్రక్రియను వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ ప్రకటించారు. విభజన సమయంలో జరిగిన అల్లర్లలో లక్షలాది మంది మరణించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భారత్కు తిరిగి వచ్చారు.
వాస్తవానికి, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, ఒకవైపు దేశంలో స్వాతంత్ర్యం కోసం ఉద్యమం పెరుగుతుండగా.. మరోవైపు మత శక్తులు కూడా పైకి లేచాయి. ప్రతిచోటా మత కలహాలు జరిగాయి. దేశంలో గందరగోళ వాతావరణం నెలకొన్నది. చివరగా ఫిబ్రవరి 1947 లో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ స్వాతంత్ర్యాన్ని ప్రకటించింది. ఈ బాధ్యతను అప్పటి వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ మౌంట్ బాటెన్కు బ్రిటిష్ ప్రభుత్వం అప్పగించింది. ఒక ప్రణాళికతో ముందుకు వచ్చిన మౌంట్ బాటెన్.. ప్రావిన్సులను స్వతంత్ర రాష్ట్రాలుగా ప్రకటించాలని ప్రతిపాదించాడు. ఈ ప్రణాళికను ‘డిక్కీ బర్డ్ ప్లాన్’ అని పిలిచేవారు. జవహర్లాల్ నెహ్రూ ఈ ప్రణాళికను వ్యతిరేకించారు. ఇది దేశాన్ని ముక్కలుగా చేసి అరాచక వాతావరణాన్ని సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు.
మౌంట్ బాటన్.. కాంగ్రెస్, ముస్లిం లీగ్ నాయకులతో సుదీర్ఘ చర్చల తర్వాత భారతదేశాన్ని రెండు దేశాలుగా విభజించే ప్రణాళికను సమర్పించారు. భారతదేశ రాజకీయ సమస్యను పరిష్కరించడానికి విభజన చివరి ఎంపిక అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రణాళికను 1947 జూలై 18 న బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించింది. దాంతో భారత్ రెండుగా విడిపోయి.. పాకిస్తాన్ ఏర్పడింది.
2014: రోడ్డు ప్రమాదంలో మరణించిన కేంద్ర క్యాబినెట్ మంత్రి గోపీనాథ్ ముండే
2009: లోక్సభ స్పీకర్గా ఎన్నికైన మీరా కుమార్
1999: కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లిన కెప్టెన్ నచీకేతా రావును భారతదేశానికి అప్పగించిన పాకిస్తాన్
1984: ఆపరేషన్ బ్లూ స్టార్ ప్రారంభించిన ప్రధాని ఇందిరాగాంధీ
1965: స్పేస్లో నడిచిన మొదటి అమెరికన్ వ్యోమగామిగా నిలిచిన ఎడ్ వైట్
1962: ఓర్లీ విమానాశ్రయంలో కూలిన ఎయిర్ ఫ్రాన్స్ విమానం, 130 మంది మృతి
1930: కేంద్ర మాజీ మంత్రి, సోషలిస్ట్ నాయకుడు జార్జ్ ఫెర్నాండెజ్ జననం
1924: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి జననం
1890: సరిహద్దు గాంధీగా పేరుగాంచిన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ జననం
అమ్మాయిలకు మెడిసిన్, ఇంజినీరింగ్లో 33 శాతం రిజర్వేషన్లు
అంతరిక్ష కేంద్రంతో ఢీకొన్న శిధిలం.. రోబోటిక్ చేయికి నష్టం
అంగారకుడి ఆకాశంలో మేఘాలు.. క్యూరియాసిటీ రోవర్ ఫొటోలు
కరోనా వేళ అన్నదాతలుగా మారిన యాసిడ్ బాధితులు..
కొవిడ్ వేళ దేశం విడిచి వెళ్తున్న కోటీశ్వరులు.. ఎందుకిలా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..