పాట్నా: బిహార్లోని అమ్మాయిలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శుభవార్తను అందించారు. మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీల్లో అమ్మాయిలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయంచారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించిన సీఎం నితీష్ ఈ విషయాన్ని ప్రకటించారు. బిహార్లో మెడికల్, ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయాల స్థాపనకు సంబంధించిన బిల్లులను కూడా ఈ సమావేశంలో చర్చించారు.
వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన సమావేశంలో ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం, వైద్య విశ్వవిద్యాలయాల స్థాపనకు ప్రతిపాదిత బిల్లును ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమర్పించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి లోకేష్ కుమార్ సింగ్, ఆరోగ్య శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ప్రతయ అమృత్.. ఇంజనీరింగ్, మెడికల్ విశ్వవిద్యాలయ చట్టాల గురించి వివరించారు. కొత్తగా రెండు విశ్వవిద్యాలయాల స్థాపనతో ఇంజినీరింగ్, వైద్య కళాశాలల నిర్వహణ మెరుగుపడటమే కాకుండా మంచి విద్య కూడా అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదే సమావేశంలో ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి బాలికలకు మూడో వంతు సీట్లు కేటాయిస్తున్నట్లు సీఎం నితీష్ ప్రకటించారు. బిహార్ విద్యార్థులు ఇంజనీరింగ్, వైద్య విద్య కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లవలసిన అవసరం ఉండకూడదని ప్రభుత్వం కోరుతోందని ముఖ్యమంత్రి చెప్పారు.
అంతరిక్ష కేంద్రంతో ఢీకొన్న శిధిలం.. రోబోటిక్ చేయికి నష్టం
ఆఫ్ఘన్ నుంచి 44 శాతం యూఎస్ బలగాల ఉపసంహరణ
శ్రీలంక తీరంలో మునిగిన ఇంధనం కార్గో షిప్
జమ్ములో మళ్లీ పాకిస్తాన్ కాల్పులు..!
అంగారకుడి ఆకాశంలో మేఘాలు.. క్యూరియాసిటీ రోవర్ ఫొటోలు
వ్యాక్సిన్ వేసుకుంటేనే జీతం చెల్లిస్తాం..
కరోనా వేళ అన్నదాతలుగా మారిన యాసిడ్ బాధితులు..
కొవిడ్ వేళ దేశం విడిచి వెళ్తున్న కోటీశ్వరులు.. ఎందుకిలా..?
తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..