కొలంబో : రసాయనాలను తీసుకొస్తున్న కార్గో షిప్లో పేలుడు సంభవించి శ్రీలంక పశ్చిమ తీరంలో మునిగిపోయింది. వారం రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదాన్ని శ్రీలంక ప్రభుత్వం, శ్రీలంక నౌకాదళం ధ్రువీకరించాయి. మునిగిపోయిన కార్గో షిప్ నుంచి పెద్ద ఎత్తున ఇంధనం సముద్రం పాలు కావడంతో పర్యావరణానికి నష్టం కలిగించవచ్చునని శాస్త్రవేత్తలు భయాందోళనలు వ్యక్త పరుస్తున్నారు. ఇది శ్రీలంకలో జరిగిన అత్యంత ఘోరమైన సముద్ర ప్రమాదంగా నౌకాదళం పేర్కొంటున్నది.
సింగపూర్-రిజిస్టర్డ్ ఎంవీ ఎక్స్-ప్రెస్ పెర్ల్లో 1486 కంటైనర్లలో 25 టన్నుల నైట్రిక్ యాసిడ్, ఇతర 325 మెట్రిక్ టన్నుల ఇంధనం ఉన్నది. ఈ ఓడలో సౌందర్య సాధనాల కోసం ముడి పదార్థాలు, రసాయనాలను గుజరాత్లోని హాగర్ నుంచి కొలంబోకు తీసుకెళ్తున్నారు. పేలుడు సంభవించి నైట్రిక్ యాసిడ్తో పాటు ఇతర ఇంధనాలకు మంటలు అంటుకోవడంతో ఓడ మూడు ముక్కలై పోయింది. చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత మంటలను అదుపులోకి తేగలిగారు. అయితె, ఓడ నుంచి పెద్ద ఎత్తున పొగలు వస్తుండటంతో కంటైనర్లు తరలించేందుకు నౌకాదళం ఇబ్బంది పడుతున్నది.
నైరుతి రుతుపవనాలు ప్రారంభమై వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కార్గో షిప్లో పేలుడు అనంతరం ఓడలో ఉన్న 25 మంది సిబ్బందిని రక్షించారు. సహాయక చర్యలో శ్రీలంక నౌకాదళంతోపాటు భారతదేశం నుంచి నాలుగు పడవలు, మూడు నౌకలు పాల్గొన్నాయి. ఓడలోని రసాయనాల వల్ల మంటలు చెలరేగాయని శ్రీలంక నావికాదళం తెలిపింది. ఈ పేలుడులో ఓడ నుంచి పెద్ద మొత్తంలో మైక్రోప్లాస్టిక్ కణాలు శ్రీలంక సముద్ర తీరంలో పేరుకుపోయాయి. దాంతో అక్కడ ఫిషింగ్ నిషేధిస్తూ శ్రీలంక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జమ్ములో మళ్లీ పాకిస్తాన్ కాల్పులు..!
అంగారకుడి ఆకాశంలో మేఘాలు.. క్యూరియాసిటీ రోవర్ ఫొటోలు
వ్యాక్సిన్ వేసుకుంటేనే జీతం చెల్లిస్తాం..
కరోనా వేళ అన్నదాతలుగా మారిన యాసిడ్ బాధితులు..
కొవిడ్ వేళ దేశం విడిచి వెళ్తున్న కోటీశ్వరులు.. ఎందుకిలా..?
తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది.. చరిత్రలో ఈరోజు
ఈ ఆరు లక్షణాలను అశ్రద్ధ చేయకండి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..