లక్నో : కరోనా వైరస్ను తరిమేసేందుకు అందరూ వ్యాక్సిన్ తీసుకునేందుకు ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లా అధికారులు వినూత్న ఆలోచనకు తెరలేపారు. వ్యాక్సిన్ వేసుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులను ప్రోత్సహించేందుకు కొత్త పంథాను ఎంచుకున్నారు. అయితే, దీనిపై దుమారం రేగడంతో ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో కాదంటూ జిల్లా కలెక్టర్ సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్లు వేసే కార్యక్రమం నడుస్తున్నది. అయితే, ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటుండటంతో జిల్లా కలెక్టర్ చంద్ర విజయ్ సింగ్ వినూత్నంగా ఆలోచించారు. కొవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్నవారికే నెల జీతం ఇస్తామంటూ ప్రకటించారు. దీనిని చీఫ్ డెవలప్మెంట్ అధికారి చర్చిత్ గౌర్ పకడ్బంధీగా అమలు చేయాలని కింది స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ చంద్ర విజయ్ సింగ్ మౌఖిక ఆదేశాలతో చర్చిత్ గౌర్.. వ్యాక్సిన్లు తీసుకుంటేనే జీతాలు చెల్లించాలని సూచించారు. కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా వ్యాక్సిన్లు వేసుకోని వారికి జీతాలు నిలిపివేయాలంటూ జిల్లా ట్రెజరీ అధికారులు, విభాగాధిపతులకు ఆదేశాలు వెళ్లాయి. వ్యాక్సిన్లు తీసుకున్న ఉద్యోగుల జాబితాను సిద్ధం చేసి తనకు పంపాల్సిందిగా కలెక్టర్ చంద్ర విజయ్ సింగ్ చెప్పారని చీఫ్ డెవలప్మెంట్ అధికారి చర్చిత్ గౌర్ తెలిపారు. జీతాలు చెల్లించకుండా ఇబ్బందిపెడుతున్నారని విమర్శలు రావడంతో కలెక్టర్ సంజాయిషీ ఇస్తూ.. ప్రభుత్వం ఏమీ అలా చేయాలని చెప్పలేదని, ప్రభుత్వ ఉద్యోగులకు వంద శాతం వ్యాక్సిన్లు వేయాలని తామే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని స్పష్టం చేశారు.
కరోనా వేళ అన్నదాతలుగా మారిన యాసిడ్ బాధితులు..
కొవిడ్ వేళ దేశం విడిచి వెళ్తున్న కోటీశ్వరులు.. ఎందుకిలా..?
తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది.. చరిత్రలో ఈరోజు
యూట్యూబర్లను పన్ను కిందకు తెచ్చిన అమెరికా
ఈ ఆరు లక్షణాలను అశ్రద్ధ చేయకండి
గొలుసుల్లో బంధించిన బాల్యం: ఆతృతతో తింటూ ఆరేండ్ల శరణార్థి కన్నుమూత
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..