Venky Atluri | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో మరోసారి నిరూపించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath And Sons) బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. సినిమా విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి అరుదైన రికార్డును సృష్టించింది.
ఈ చిత్రంలో సూర్య సరసన మమిత బైజు హీరోయిన్గా నటించగా, రాధికా శరత్కుమార్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై సూర్య సృష్టించిన ఈ సునామీ వసూళ్లతో ట్రేడ్ వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్ల వద్ద ‘బ్లాక్బస్టర్ విశ్వనాథ్ అండ్ సన్స్’ జోరు కొనసాగుతుండటంతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగిపోయింది. త్వరలోనే ఈ సినిమా మరిన్ని రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
#VishwanathAndSons hits it out of the park and smashes a 100cr+ in just 2 days 💥💥#BlockbusterVAS running successfully in cinemas near you ❤️#BlockbusterVishwanathAndSons @Suriya_offl #VenkyAtluri @_mamithabaiju @realradikaa @TandonRaveena @gvprakash @vamsi84 @NavinNooli… pic.twitter.com/fhIpLYvFJb
— Sithara Entertainments (@SitharaEnts) August 16, 2026