కోపెన్హాగన్ : డెన్మార్క్ ఒక కృత్రిమ ద్వీపాన్ని సృష్టిస్తున్నది. కోపెన్హాగన్ నౌకాశ్రయాన్ని సముద్ర మట్టాలు పెరగకుండా కాపాడటానికి ఈ కృత్రిమ ద్వీపాన్ని నిర్మించే ప్రాజెక్టుకు డెన్మార్క్ పార్లమెంట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. డెన్మార్క్ ఈ ద్వీపానికి లినెథోల్మ్ అని పేరు పెట్టింది. డానిష్ ప్రభుత్వం ప్రకారం, ఇది దేశ చరిత్రలో ఇప్పటివరకు అతిపెద్ద నిర్మాణ ప్రాజెక్టుల్లో ఒకటి.
ఈ కృత్రిమ ద్వీపం నిర్మాణానికి డెన్మార్క్ పార్లమెంట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. పార్లమెంటులో 85 మంది ఎంపీలు బిల్లుకు అనుకూలంగా, 12 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదించే సమయంలో రాజధాని కోపెన్హాగన్లోని పార్లమెంట్ హౌస్ వెలుపల ఈ ద్వీపం నిర్మాణానికి వ్యతిరేకంగా భారీగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ బిల్లును నిరసనకారులు వ్యతిరేకించారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వం పునః పరిశీలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ ద్వీపం పరిమాణం ఒక చదరపు మైలు.. అంటే 2.6 చదరపు కిలోమీటర్లు. ఈ ఏడాది చివరి నాటికి ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ద్వీపం చుట్టూ ఆనకట్ట వ్యవస్థ నిర్మించి సముద్ర మట్టాలు, తుఫానుల నుంచి ఓడరేవును రక్షించడం ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. ఇక్కడ సుమారు 35,000 మంది నివసించేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. రింగ్ రోడ్లు, సొరంగాలు, మెట్రో లైన్ల ద్వారా డెన్మార్క్ ప్రధాన భూభాగానికి అనుసంధానించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నది. పనులు అనుక్నట్లుగా జరిగితే 2035 నాటికి సిద్ధంగా ఉంటుంది. 2070 నాటికి ఈ ద్వీపం అన్ని హంగులతో అందుబాటులోకి రానున్నది.
ఔట్లుక్ నివేదిక : పర్యావరణ ప్రమాద జాబితాలో 43 నగరాలు మనవే..!
పర్యావరణ హితం : చెట్టుపై ఇల్లు కట్టిన ఐఐటీయన్
నెస్ట్-2021 దరఖాస్తు దాఖలు గడువు పొడగింపు
కరోనా ఎఫెక్ట్ : వైష్ణో దేవి యాత్రకు తగ్గిన భక్తులు
ప్రపంచ పర్యావరణ దినం: పీపీఈ కిట్ భూమిలో కరగడానికి 500 ఏండ్లు
చరిత్రలో ఈరోజు : ఐదుగురిలో తొలిసారి ఎయిడ్స్ గుర్తింపు
కరోనా టైం: సప్లిమెంట్స్ నకిలీలను ఇలా కనిపెట్టండి..!
లాక్డౌన్ ఎఫెక్ట్ : పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం
కింగ్ కోబ్రా : శివాలిక్ కొండల్లో దర్శనం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..