భువనేశ్వర్: ఒడిశాలోని రాయగడలో స్వల్పంగా భూమి కంపించింది. రాయగడ జిల్లాలో గురువారం ఉదయం 4 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. దీని తీవ్రత భూకంపలేఖినిపై 3.2గా నమోదయ్యిందని తెలిపింది. భూఅంతర్భాగంలో 10 కి.మీ. లోతులో భూమి కంపించిందని ప్రకటించింది. జిల్లావ్యాప్తంగా భూ ప్రకంపణలు సంభవించాయని, దీనివల్ల జరిగిన ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన విషయాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..