మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 25 : రాష్ట్రవ్యాప్తం గా ఉన్న మున్సిపాలిటీల్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను ఏప్రిల్ నెలలోనే చెల్లిస్తే ఐదు శాతం రిబేటును ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల మొదటివారంలో నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై అధికారులు ప్రజలకు సరైన ప్రచారాన్ని క ల్పించకపోవడం, ప్రభుత్వం ఆస్తిపన్నుపై వి ధించే వడ్డీని మాఫీ చేస్తుండడం వంటి అంశాలతో ఈ ఐదు శాతం రిబేటుకు ప్రజల నుంచి స్పందన ఆశించినంత రావడం లేదు. మంచిర్యాల మున్సిపాలిటీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 27,112 అసెస్మెం ట్ల నుంచి మొత్తం రూ.16.47 కోట్లు ఆస్తిప న్ను రూపేణ వసూలు చేయాలి. ఏప్రిల్ ఒక టో తేదీన వచ్చిన రిబేటు స్కీంను ఇప్పటివరకు 3,200 మంది మాత్రమే ఉపయోగించుకున్నారు. వీరి నుంచి రూ.1.85 కోట్లు మాత్ర మే ఆస్తిపన్ను వసూలు అయ్యింది.
ఐదు శా తం రిబేటు స్కీం మరో ఐదు రోజుల్లో ముగియనుంది. ఐదు శాతం రిబేటు బూచీని చూ పించి భవన యజమానుల నుంచి వచ్చినకాడికి ఆస్తిపన్నులను వసూలు చేయాలని ము న్సిపల్ అధికారులు భావిస్తున్నా ఆచరణలో సాధ్య పడడం లేదు. వీలైనంత వరకు ఆస్తిపన్నును ఈ నెలలోనే వసూలు చేస్తే ఆర్థిక సంవత్సరం చివరలో పన్ను వసూళ్లకు ఇబ్బందులు పడాల్సిన అవసరం అంతగా ఉండదని, ల క్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చుననే ఆలోచన లో ఉన్న అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా రు. ఇందులో భాగంగా ఆటోలను వార్డుల్లో తిప్పుతూ మైకుల ద్వారా ప్రచారాన్ని చేస్తున్నారు. లోకల్ కేబుల్ ఆపరేటర్ల ద్వారా ప్రచారాన్ని చేస్తున్నారు. మిగిలిన ఐదు రోజుల్లో వీలైనంత వరకు భవన యజమానులతో ఐదు శాతం రిబేటులో ఆస్తి పన్నును చెల్లించేలా చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ అల్లె మారుతి ప్రసాద్ తెలిపారు.