బెంగళూరు: వయసు మీద పడటం, అనారోగ్య సమస్యలు, రాజకీయాల్లో పెరిగిన అవినీతి కారణంగా 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య శనివారం ప్రకటించారు. ప్రజా జీవితంలో క్రియాశీలకంగా కొనసాగుతూ ప్రజల పక్షాన నిలబడతానని స్పష్టం చేశారు. ఎన్నికల నాటికి తనకు 81-82 ఏళ్లు వస్తాయని, గతంలో ఉన్న ఉత్సాహంతో పనిచేయడం ఇకపై సాధ్యం కాదని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలకు డబ్బు పంచాల్సిన దుస్థితి వచ్చిందని మాజీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.