హైదరాబాద్, జూలై 26(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురసరించుకుని ఆయన పిలుపునిచ్చిన ‘గిప్ట్ ఏ స్మైల్’ సేవా కార్యక్రమాన్ని మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకలు, కేక్ కటింగ్లకు ప్రాధాన్యం ఇవ్వకుండా, అనాథలకు చేయూతనివ్వాలనే కేటీఆర్ ఆలోచనకు అనుగుణంగా ఓ అనాథ శరణాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనాథ చిన్నారులకు పండ్లు, స్టేషనరీ పంపిణీ చేయడంతోపాటు శరణాలయం నిర్వహణ కోసం ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు మారుతి కుర్మ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం కేటీఆర్ జన్మదినాన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం తమకు ఎంతో ఆనందదాయకమని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మలేషియా వ్యవస్థాపకుడు చిట్టి చిరుత, ఉపాధ్యక్షుడు అరుణ్ మునిగల, కార్యదర్శి సందీప్కుమార్ లగిశెట్టి, కమిటీ సభ్యులు సత్యనారాయణరావు నడిపెల్లి, హరీశ్ గుడిపాటి, సురేష్, శ్యామ్, పూర్ణచందర్రావు, క్రాంతి, అభినయ్, కృష్ణ, సందీప్ గాజెంగి, గౌతమ్, శేషి తదితరులు పాల్గొన్నారు.