కుభీర్, ఏప్రిల్ 25 : పాఠశాలలు పునఃప్రారం భం అయ్యే నాటికి విద్యార్థుల సౌకర్యాల కో సం మంజూరు చేసిన నిధులతో చేపడుతున్న పనులను పూర్తి చేయాలని నిర్మల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు.
గురువారం ఆయన కుభీర్, రాజురా, జుండ గ్రామాలలో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పాఠశాలల్లో కొనసాగుతున్న మౌలిక వసతుల కల్పన పనులను పరిశీలించారు. త్వరిత గతిన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం నర్సరీలను సందర్శించారు. ఆయన వెంట ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీవో రాథోడ్ హరిలాల్, ఏపీవో రమేశ్ ఉన్నారు.