హైదరాబాద్ : ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గోవా, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ మరోసారి భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపొందింది. మణిపూర్, ఉత్తరాఖండ్లోనూ బీజేపీనే అధికారం చేజిక్కించుకోనుంది. గోవాలో బీజేపీ లీడింగ్లో ఉంది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తనకు నష్టం కాబోదని రైతు నేత రాకేష్ తికాయత్ అన్నారు. బీజేపీ విజయం భారతీయ కిసాన్ యూనియన్కు నష్టం ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు. తాము రాజకీయ నేతలం కాదని, తాము మార్పును కోరేవారమని, సామాజిక కార్యకర్తలమని ఆయన పేర్కొన్నారు.
గోవా ఎన్నికల్లో బీజేపీ సగం సీట్లు సాధించింది. ఇక్కడ మొత్తం 40 సీట్లు ఉండగా.. బీజేపీ 20 సీట్లలో విజయం సాధించింది. దీంతో ఇక్కడ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ క్రమంలో ఇక్కడ తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని సీఎం ప్రమోద్ సావంత్ ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ మేలుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ నేత అశ్వనీ కుమార్ పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో వచ్చిన ఎన్నికలు చాలా పరిణామాత్మక ఎన్నికలని ఆయన అభివర్ణించారు. ఇక.. కాంగ్రెస్కు అవసరమైన ఫలితాలను గాంధీ కుటుంబం తీసుకురాలేదని స్పష్టం చేశారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై ఆ పార్టీ నేతలు స్పందించారు.విపక్షాల మధ్య ఓట్ల చీలికతోనే కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్ధానాలు దక్కలేదని సీనియర్ నేత పీ చిదంబరం పేర్కొన్నారు. బీజేపీ కేవలం 33 శాతం పైచిలుకు ఓట్లతోనే విజయం సాధించిందని, మిగిలిన పార్టీల మధ్య ఓట్ల చీలికతో తమ పార్టీ వెనుకపడిందని వ్యాఖ్యానించారు.
పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మహిళా అభ్యర్థి జీవన్ జ్యోత్ కౌర్ ఓడించారు. అమృత్సర్ ఈస్ట్లో పోటీ చేసిన ఆమె సిద్ధూతోపాటు అదే స్థానంలో బరిలోకి దిగిన శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ) నేత బిక్రమ్ సింగ్ మజితియాపైనా విజయం సాధించారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడైన సిద్ధూ అమృత్సర్ ఈస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే. బిక్రమ్ సింగ్ మజితియా మాజీ మంత్రి, ఎస్ఏడీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ బంధువు.
ఉత్తరప్రదేశ్లో అధికార బీజేపీ ఘన విజయం సాధించింది. మునుపటి కంటే ఓ 40 స్థానాలు తగ్గినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే సుమారు 70 స్థానాలు అధికంగానే సాధించింది. లఖింపూర్ ఖేరీ ఘటన, వ్యవసాయ చట్టాలు, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా.. చివరికి యోగీ మాయాజాలమే పనిచేసింది.
అయితే, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పంకజ్సింగ్.. అఖండ మెజారిటీ సాధించారు. నోయిడా అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగిన ఆయన సమాజ్వాది పార్టీ అభ్యర్థిపై ఏకంగా లక్షా 79 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎస్పీ అభ్యర్థి సునీల్ చౌదరి కేవలం 26 వేల ఓట్లు మాత్రమే సాధించి రెండో స్థానానికి పరిమితమయ్యారు.
దేశమంతా ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించే చర్చిస్తోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి రానుందో తేలిపోయింది. ఇంకా కొన్ని నియోజకవర్గాల ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. పంజాబ్లో ఆప్ క్లీన్ స్వీప్ చేసింది.
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. శాంక్విలిమ్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ధర్మేష్ సగ్లానీపై 650 ఓట్ల తేడాలో గెలుపొందారు. విజయం సాధించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గోవాలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ దీటైన పోరాట స్ఫూర్తి కనబరిచారని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. యూపీలో ఓటమికి అఖిలేష్ యాదవ్ తప్పులేదని, ఆయన సొంతంగా పోటీ చేసి శక్తియుక్తులన్నీ కేంద్రీకరించారని పవార్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల గురించి ఆలోచించకుండా మడమతిప్పని పోరాడం చేశారని ప్రశంసించారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో కాషాయ పార్టీతో దీటుగా పోరాడారని అన్నారు.
పంజాబ్ ఫలితాలు, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓటమిపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం పంజాబ్ ప్రజలకు ఏమాత్రం నచ్చలేదని, అందుకే ఓడిపోయారని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం అమరీందర్ సింగ్ బీజేపీతో జట్టు కట్టడం వల్ల ప్రజలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని అన్నారు. ‘కెప్టెన్ అమరీందర్ సింగ్ సొంత పార్టీ పెట్టుకున్నారు. తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో జట్టు కట్టారు. పంజాబ్ ప్రజలకు ఇది రుచించలేదు’ అని పవార్ పేర్కొన్నారు.
ఉత్తరాఖండ్ ఎన్నికల్లో అధికార బీజేపీ ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం వైపు దూసుకెళ్తున్నా.. సీఎం పుష్కర్ సింగ్ ధామి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఖతిమా నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న పుష్కర్ సింగ్ ధామి.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భువన్ కప్రీ చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. భువన్ చంద్ కప్రీ.. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీపై 6,951 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. 47 వేల ఓట్లకు పైగా మెజారిటీతో ఆయన గెలిచారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రజా తీర్పును స్వీకరిస్తున్నామని చెబుతూ ఎన్నికల్లో విజయం సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రికార్డు సృష్టించారు. 15 ఏళ్ల తర్వాత తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అలాగే ఎమ్మెల్యేగా సీఎం పదవిని రెండోసారి చేపట్టనున్నారు. 2017లో యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎం అయ్యారు. అప్పటికే ఆయన ఐదుసార్లు గోరఖ్పూర్ ఎంపీగా గెలిచారు.
ఇప్పటి వరకు 5 సార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా సేవలందించిన బాదల్ను ఆప్కు చెందిన గుర్మీత్ సింగ్ ఖుడియన్ ఓడించారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. 1969 నుంచి ఎన్నికల్లో బాదల్ ఓడిపోవడం ఇప్పటి వరకూ జరగలేదు. ఇదే ఆయనకు తొలి ఓటమి.
గోవాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ ఎన్నికల ఇన్చార్జి, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర సింగ్ ఫడ్నవీస్ అన్నారు. ఎంజీపీ, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేస్తుందని తెలిపారు.
రాజ్భవన్లో కాకుండా భగత్సింగ్ గ్రామమైన ఖట్కర్కలన్లో సీఎంగా ప్రమాణం చేస్తానని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత భగవంత్ మాన్ తెలిపారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ధురీ నియోజకవర్గం నుంచి ఆప్ సీఎం అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన 58,206 ఓట్ల మార్జిన్తో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో...
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..
పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చెన్నీ రెండు చోట్లా ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. పోటీ చేసిన రెండు చోట్లా ఆయన ఓడిపోయారు. దీంతో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలినట్లైంది.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..
పంజాబ్లో ఆఫ్ భారీ విజయం సాధించడంపై కేజ్రీవాల్ స్పందించారు. పాత వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం వ్యవస్థలను మార్చే పని చేస్తున్నామన్న కేజ్రీవాల్.. ఆమ్ ఆద్మీ పార్టీ జోరును ఎవరూ ఆపలేరని అన్నారు. పెద్ద నేతలంతా కలిసి దేశం ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. దేశంలో ఇంకా బ్రిటీష్ పాలన కొనసాగుతోందని వ్యాఖ్యానించారు.
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సమయంలో వేడుకలు చేసుకోవడానికి వీల్లేదని ఎన్నికల సంఘం (ఈసీ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో పార్టీలకు ఈసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఐదు రాష్ట్రాల్లో విజేతలు వేడుకలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది.
పంజాబ్లో బంపర్ మెజారిటీతో విజయం సాధించిన ఆమ్ఆద్మీకి శిరోమణీ అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ శుభాకాంక్షలు తెలిపారు. మనస్ఫూర్తిగా ఆమ్ఆద్మీకి శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆయన ట్వీట్ చేశారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనానికి సమాజ్వాదీ పార్టీ బ్రేక్ వేస్తోంది. గంటగంటకూ ఆధిక్యాలు మారుతుండటంతో అంకెలు తారుమారవుతున్నాయి. ఓ దశలో 115 స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్న ఎస్పీ తాజాగా 137 స్ధానాల్లో ఆధిక్యంలోకి రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
గోవాలో తాము ప్రతిపక్షంలోనే కొనసాగుతామని కాంగ్రెస్ పార్టీ నేత మైఖెల్ లోబో ప్రకటించారు. ఈఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని అనుకున్నాం. అయితే ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని చెప్పారు.
ప్రజల తీర్పును శిరసావహిస్తున్నానని మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ప్రజల తీర్పును స్వీకరిస్తున్నా. అత్యంత నిరాడంబరంగా స్వీకరిస్తున్నారు. కులం, మతం అన్న గోడలను దాటి.. పంజాబ్ ప్రజలు తమ తీర్పును ఇచ్చారు. పంజాబియత్ స్ఫూర్తిని చాటారు’ అంటూ కెప్టెన్ అమరీందర్ సింగ్ ట్వీట్లో పేర్కొన్నారు
ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్రావత్ లాల్ కువాల్ స్థానంలో ఓటమి పాలయ్యారు. 10వేలకుపైగా ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి మోహన్ సింగ్ బిస్తీ చేతిలో దాదాపు 14వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
గోవాలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం ప్రమోద్ సావంత్ ప్రకటించారు. ఎంజీపీ, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి సర్కార్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఎస్పీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. టీవీ ట్రెండ్స్ను నమ్మకండి.. చివరిదాకా వేచి చూడండి అని అఖిలేష్ సూచించారు.
పంజాబ్లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP).. గోవాలో ఖాతా తెరిచింది. బెనౌలిమ్ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీచేసిన కెప్టెన్ వీంజీ వీగస్ తన సమీప అభ్యర్థి చర్చిల్ అలెమావోపై విజయం సాధించారు.
గోవాలో బీజేపీ (BJP) అతిపెద్దపార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు రాష్ట్ర గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లైని కలువనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు.
ఈ ఎన్నికల్లో తాను కాంగ్రెస్తోపాటు సొంత పార్టీ బీజేపీతోనూ పోరాడి గెలిచానని బీజేపీ నూతన ఎమ్మెల్యే అటనాసియో మాన్సెరట్టె సంచలన వ్యాఖ్య చేశారు. తాజా ఎన్నికల్లో ఆయన గోవా రాజధాని పనాజీ అసెంబ్లీ స్థానం నుంచి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్పై 800 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..
ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల కన్నా బెటర్గా నిషాద్ పార్టీ పర్ఫార్మ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్రంలో నిషాద్ పార్టీ 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీతో జతకట్టిన నిషాద్.. యూపీలో పోటీ చేస్తోంది.
పంజాబ్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ స్పందించారు. ఘన విజయం సాధించిన ఆమ్ఆద్మీని ఈ సందర్భంగా సిద్దూ అభినందించారు. ‘ప్రజల వాక్కే దైవవాక్కు. ప్రజల తీర్పును శిరసావహిస్తున్నాను. ఆప్కు శుభాకాంక్షలు’ అంటూ సిద్దూ ట్వీట్ చేశారు.
అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం చేసిన సోనూ సోదరి మాళవిక సూద్ వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్లో చేరి పంజాబ్ ఎన్నికల బరిలో దిగిన మాళవిక.. మోగా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే పంజాబ్లో ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) హవా ముందు మాళవిక నిలవలేకపోయారు. ఆప్ అభ్యర్థి డాక్టర్ అమన్దీప్ కౌర్ అరోరా ఇక్కడ ముందంజలో ఉన్నారు.
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ భారీ విజయం సాధించారు. హీగాంగ్ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఎన్ బీరెన్ సింగ్ 18 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పీ శరత్ చంద్ర ఓటమి పాలయ్యారు.
గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ (Manohar parrikar) కుమారుడు ఉత్పల్ పారికర్ ఓటమిపాలయ్యారు. బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఉత్పల్ పారికర్.. పనాజీ (Panaji) అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే బీజేపీ అభ్యర్థి ఏబీపీ మజ్హా చేతిలో 800 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఉత్తరప్రదేశ్లోని ఫజిల్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్పీ సీనియర్ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య వెనుకంజలో ఉన్నారు. యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్వాది పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో ఫజిల్నగర్ నుంచి ఆయన బరిలో దిగిన ఆయన వెనుకంజలో కొనసాగుతున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్ జిల్లా కేంద్రమైన రాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సమాజ్వాది పార్టీ అభ్యర్థి అజాంఖాన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ స్థానం నుంచి ఆయన బీజేపీ అభ్యర్థి శివబహదూర్ సక్సేనాపై 46,842 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఫలితాల్లో వెనుక పడ్డారు. ప్రత్యర్థి కంటే 16 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఎన్నికల్లో విజయంపై బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.
పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ రికార్డు విజయం దిశగా దూసుకెళ్తోంది. దీంతో ఢిల్లీలోని ఆ పార్టీ ఆఫీసు వద్ద కార్యకర్తలు చీపుర్లు పట్టుకుని సంబరాలు చేసుకుంటున్నారు. బాణాసంచా కాలుస్తూ స్వీట్లు పంచుతున్నారు. కాగా పంజాబ్లో భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్లడంపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ స్పందించారు. ఇది భగవంత్ సింగ్ విజయమని కొనియాడారు. పంజాబ్లో విప్లవం తెచ్చిన భగవంత్కు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.
इस इंक़लाब के लिए पंजाब के लोगों को बहुत-बहुत बधाई। pic.twitter.com/BIJqv8OnGa
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 10, 2022
గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లీడ్లోకి వచ్చింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీలు నువ్వా నేనా అన్నట్లు సాగుతున్నాయి. ప్రారంభం నుంచి ఒక్క స్థానంలోనూ ఆధిక్యంలో లేని ఆప్.. ఇప్పుడు రెండు స్థానాల్లో ముందంజ వేసింది.
పంజాబ్లో భారతీయ జనతా పార్టీ చతికిల పడిపోయింది. కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది. పంజాబ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆశ్విని కుమార్ శర్మ మాత్రం గెలిచారు. ఆశ్విని కుమార్ పఠాన్కోట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.
పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్కు ఓటమి పాలయ్యారు. పటియాల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అమరీందర్ సింగ్... ఆప్ అభ్యర్థి అజిత్పాల్ సింగ్ కోహ్లీ చేతిలో ఒడిపోయారు.
మెయిన్పురి జిల్లాలోని కర్హాల్ అసెంబ్లీ స్థానం యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. అక్కడి నుంచి ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీఎస్పీ అభ్యర్థి కుల్దీప్ నారాయణ్ రెండో స్థానంలో ఉన్నారు. ఇక బీజేపీ అభ్యర్థి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ మూడో స్థానంలో ఉన్నారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) మళ్లీ బీజేపీయే అధికారం చేపట్టనుంది. ఎన్నికలు ప్రారంభమైన నాటినుంచి అందరి దృష్టిని ఆకర్షించిన యూపీలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా కమలం పార్టీ అడుగులు వేస్తున్నది. మెజార్టీకి మించి స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్నది.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..
ఆమ్ ఆద్మీ ఊడ్చేసింది. పంజాబ్లో వన్మ్యాన్ షో ప్రదర్శించింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆ పార్టీ సంచలనం నమోదు చేసింది. తాజా రిపోర్ట్ ప్రకారం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్లో.. 89 స్థానాల్లో ఆప్ లీడింగ్లో ఉంది. కేజ్రీవాల్ ఇచ్చిన వాగ్ధానాలు పంజాబీలను అట్రాక్ట్ చేసింది.
: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఉత్తరాఖండ్ మినహా అన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీ చతికిలబడింది. పంజాబ్లో అయితే అధికారాన్ని కోల్పోవడమేగాక గౌరప్రదమైన స్థానాలు దక్కే అవకాశం కూడా లేదు. పంజాబ్ పీసీసీ ప్రెసిడెంట్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. కెప్టెన్ అమరీందర్సింగ్కు పొగబెట్టడం ద్వారా అక్కడ పార్టీ కొంపముంచాడని విశ్లేషకులు అంటున్నారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..
గోవాలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు నడుస్తున్నది. ఉదయం 11 గంటల సమయానికి రెండు పార్టీలో దాదాపు సమాన స్థానాల్లో లీడింగ్లో ఉన్నాయి. దాంతో రెండు పార్టీలు అప్పుడే క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టాయి. తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు చేజారీపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..
గోవా సీఎం ప్రమోద్ సావంత్ (CM Pramod Sawant) మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. సాంక్వెలిమ్ నియోజకర్గంలో పోటీచేస్తున్న ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి లీడ్లో ఉంటూ వచ్చారు. అయితే సావంత్ మరోసారి ముందంజలో నిలిచారు. రాష్ట్ర అసెంబ్లీలో 40 స్థానాలు ఉండగా బీజేపీ 18 సీట్లలో ఆధిక్యంలో ఉన్నది.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ముందంజలో ఉండగా, ఎస్పీ వెనుకంజలో ఉంది. ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీ 97 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఈ క్రమంలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ లక్నోలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎస్పీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. యూపీలో బీజేపీ మెజార్టీ మార్కును దాటింది.
#WATCH | Samajwadi Party (SP) chief Akhilesh Yadav arrives at the party office in Lucknow. The party is leading on 97 seats in #UttarPradeshElections so far.
BJP has crossed the majority mark in the state. pic.twitter.com/ZyOhmBWhNO
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 10, 2022