కాంగ్రెస్ మేలుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ నేత అశ్వనీ కుమార్ పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో వచ్చిన ఎన్నికలు చాలా పరిణామాత్మక ఎన్నికలని ఆయన అభివర్ణించారు. ఇక.. కాంగ్రెస్కు అవసరమైన ఫలితాలను గాంధీ కుటుంబం తీసుకురాలేదని స్పష్టం చేశారు. పార్టీకి జవసత్వాలు నింపడం వారితో కుదరదని అశ్వనీ కుమార్ పేర్కొన్నారు. తాను ఇప్పటికీ సోనియా గాంధీ విధేయుడినేనని తనకు తాను ప్రకటించుకున్నారు. ఈ ఫలితాలను చూసి కాంగ్రెస్ పట్ల జాలిపడుతున్నానని ఎద్దేవా చేశారు. గత మూడు నెలలుగా పంజాబ్లో సర్కస్ నడుస్తోందని, రాజకీయాలు దిగజారుతున్నాయని అశ్వనీ కుమార్ పేర్కొన్నారు.