లక్నో: ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) మళ్లీ బీజేపీయే అధికారం చేపట్టనుంది. ఎన్నికలు ప్రారంభమైన నాటినుంచి అందరి దృష్టిని ఆకర్షించిన యూపీలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా కమలం పార్టీ అడుగులు వేస్తున్నది. మెజార్టీకి మించి స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఇప్పటివరకు 272 సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అయితే గతంలో కొంటే కొన్ని స్థానాలు కోల్పోయినప్పటికీ అన్ని రీజియన్లలో పార్టీ తన హవా కొనసాగించింది.
ఈశాన్య యూపీలో 61 స్థానాలు ఉండగా బీజేపీ 39 చోట్ల, ఎస్పీ 16 స్థానాల్లో, నిషాద్ 2, ఏడీఎస్, ఎస్బీఎస్పీ, ఒక స్థానంలో ముందంజలో ఉన్నాయి. అవధ్ రీజియన్లోని 78 స్థానాల్లో బీజేపీ 53, ఎస్పీ 19, ఏడీఎస్, ఇతరులు రెండు స్థానాల చొప్పున, బీఎస్పీ, కాంగ్రెస్ ఒక్కో స్థానంలో లీడ్లో కొనసాగుతున్నాయి.
రుహేల్ఖండ్ రీజియన్లోని మొత్తం 52 సీట్లలో బీజేపీ 29, ఎస్పీ 21, బీఎస్పీ, ఇతరులు ఒక్కో స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. తూర్పు యూపీలో 76 స్థానాలు ఉండగా.. బీజేపీ 34, ఎస్పీ 32, ఏడీఎస్ 5, నిషాద్ 2 స్థానాల్లో ఎస్బీఎస్పీ, బీఎస్పీ, జేడీయూ ఒక్కో స్థానంలో ముందంజలో ఉన్నాయి.
బుందేల్ఖండ్లో 19 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ 15, ఏడీఎస్, ఎస్పీ రెండు చొప్పున ఆధిక్యంలో ఉన్నాయి. ఇక దోబ్ రీజయన్లో 73 స్థానాలు ఉండగా.. బీజేపీ 51, ఎస్పీ 17, ఏడీఎస్ 2, ఆర్ఎల్డీ, కాంగ్రెస్ ఒక్కో స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.
పశ్చిమ యూపీలోని 44 సీట్లలో బీజేపీ 31, ఆర్ఎల్డీ 8, ఎస్పీ 5, ఎస్బీఎస్పీ, బీఎస్పీ, ఇతరులు ఒక్కో స్థానం చొప్పున ముందంజలో కొనసాగుతున్నాయి.