పనాజీ: గోవా సీఎం ప్రమోద్ సావంత్ (CM Pramod Sawant) మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. సాంక్వెలిమ్ నియోజకర్గంలో పోటీచేస్తున్న ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి లీడ్లో ఉంటూ వచ్చారు. అయితే సావంత్ మరోసారి ముందంజలో నిలిచారు. రాష్ట్ర అసెంబ్లీలో 40 స్థానాలు ఉండగా బీజేపీ 18 సీట్లలో ఆధిక్యంలో ఉన్నది. కాంగ్రెస్ 13 స్థానాల్లో, టీఎంసీ 5 చోట్ల, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు.
ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో టీఎంసీ కీలకం కానున్నది. ఈ నేపథ్యంలో పార్టీలు తమ అభ్యర్థులను కాపాడుకోవడానికి రంగంలోకి దిగాయి. క్యాండిడేట్లను క్యాంపులకు తరలిస్తున్నాయి.