పనాజీ: ఈ ఎన్నికల్లో తాను కాంగ్రెస్తోపాటు సొంత పార్టీ బీజేపీతోనూ పోరాడి గెలిచానని బీజేపీ నూతన ఎమ్మెల్యే అటనాసియో మాన్సెరట్టె సంచలన వ్యాఖ్య చేశారు. తాజా ఎన్నికల్లో ఆయన గోవా రాజధాని పనాజీ అసెంబ్లీ స్థానం నుంచి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్పై 800 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
అనంతరం మీడియాతో మాట్టాడిన మాన్సెరట్టే.. ఫలితం వెలువడే వరకు తాను అసంతృప్తితో ఉన్నానని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి పనాజీలో బీజేపీ క్యాడర్ తనకు వ్యతిరేకంగా, తన ప్రత్యర్థి ఉత్పల్ పారికర్కు అనుకూలంగా పనిచేసిందని మాన్సెరట్టే ఆరోపించారు. అందువల్ల తనకు మద్దతు నిలిచిన కొంతమంది కార్యకర్తల సహకారంతో కాంగ్రెస్తోపాటు, బీజేపీతోనూ తాను పోరాడి గెలిచానని చెప్పారు.
పనాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మాన్సెరట్టే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. దాంతో బీజేపీ.. ఉత్పల్ పారికర్కు పనాజీ స్థానం కాకుండా వేరే స్థానాలను ఆఫర్ చేసింది. అందుకు నిరాకరించిన ఉత్పల్.. బీజేపీ నుంచి బయటికి వచ్చి పనాజీ నుంచే స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగారు. బీజేపీ అబ్యర్థి మాన్పెరట్టే చేతిలో 800 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.