ముంబై: కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని వణికిస్తున్న వేళ.. ప్రజలను ఆదుకునేందుకు బ్యాంకులు కూడా ముందుకు వచ్చాయి. కోవిడ్-19 చికిత్స కోసం వ్యక్తులకు రూ.5 లక్షల వరకు రుణాలివ్వనున్నాయి. అంతే కాదు.. హెల్త్కేర్ మౌలిక వసతుల కల్పన కోసం రూ.100 కోట్లతో నిధిని ఏర్పాటు చేశాయి.
ఈ కార్యక్రమాన్ని ఆదివారం స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ దినేష్ ఖరా, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్ రాజ్ కిరణ్ రాయ్ ప్రారంభించారు. భద్రతలేని ఈ రుణాలపై 8.5 శాతం వడ్డీరేటు వసూలు చేస్తామని దినేశ్ ఖరా చెప్పారు.
ఈ నెల ప్రారంభంలో ఆర్బీఐ ప్రకటించిన స్కీమ్ కింద చిన్న వ్యాపారులను పునర్వ్యవస్థీకరిస్తామని బ్యాంకర్లు తెలిపారు. రుణాల పునర్వ్యవస్థీకరణ కోరుతూ వ్యక్తులు తమ అప్లికేషన్లను ఆన్ లైన్లో గానీ, వ్యక్తిగతంగా గానీ సమర్పించాలని కోరారు.
వ్యక్తిగత రుణాలపై పునర్వ్యవస్థీకరణ దరఖాస్తు సమర్పించిన 30 రోజుల్లోపు రుణగ్రహీత, బ్యాంకర్లు రిజొల్యూషన్ ప్లాన్ ఆమోదించుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 30లోపు రిజొల్యూషన్ ప్లాన్ను ఖరారు చేసుకోవాలి.
ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖర్రా మాట్లాడుతూ వ్యక్తిగత రుణాలతోపాటు రూ.25 కోట్ల వరకు చిన్న వ్యాపారులు లేదా ఎంఎస్ఎంఈ రుణాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వ రంగ బ్యాంకులు టెంప్లేటెడ్ అప్రోచ్ రూపొందించుకున్నాయన్నారు.
బ్యాంకర్లు అర్హులైన కస్టమర్లకు భారీ ఎస్సెమ్మెస్ల రూపేణా ఆఫర్ చేస్తున్నారు. అర్హులు ఆన్లైన్లో బ్యాంకులు ఇచ్చిన ఈ ఆఫర్ను ఎలక్ట్రానిక్గా ఆమోదించడంతోపాటు అప్లికేషన్ పంపాల్సి ఉంటుంది.
కరోనా బారిన పడ్డ రోగులు, వారి కుటుంబ సభ్యుల చికిత్స కోసం బ్యాంకులు పర్సనల్ లోన్లు మంజూరు చేస్తాయి. కనీసంగా రూ.25 వేలు మంజూరు చేస్తాయి. గరిష్ఠంగా ఐదేండ్లలోపు చెల్లించాలి.
ప్రాధాన్య రంగాల వారీగా బ్యాంకర్లు రూ.50 వేల కోట్ల వరకు రీఫైనాన్స్ చేయాలని ఆర్బీఐ ప్రోత్సహించింది. గతేడాది మేలో ఆక్సిజన్ ప్లాంట్లు, వ్యాక్సిన్ల తయారీ దారులకు ఫైనాన్స్ చేసేందుకు బ్యాంకులు ముందుకు వచ్చాయి. స్టాండర్డ్ ప్యాకేజీల్లో రుణాల పంపిణీని బ్యాంకులు వేగవంతం చేసే అవకాశం ఉంది.
హాస్పిటల్స్, నర్సింగ్ హోంలు, క్లినిక్స్, డయాగ్నస్టిస్ కేంద్రాలు, ప్యాథాలజీ ల్యాబ్స్ తదితర హెల్త్కేర్ రంగంలో మౌలిక వసతుల కల్పనకు బిజినెస్ రుణాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
మెట్రో సెంటర్లలో రూ.100 కోట్లు, ప్రథమ శ్రేణి నగరాలు, అర్బన్ సెంటర్లలో రూ.20 కోట్ల మేరకు రుణాలివ్వనున్నాయి. చిన్న పట్టణాల్లోని సంస్థలకు రూ.10 కోట్ల రుణాలు బ్యాంకులు మంజూరు చేస్తాయి.
రేపట్నుంచి బ్యాంకుల పని వేళల్లో మార్పు
ఐటీ రూల్స్: ఫిర్యాదుల స్వీకరణకు సోషల్ మీడియా ఏర్పాట్లు!
చిన్న వ్యాపారులకు రిలీఫ్.. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ!
ఎస్బీఐ vs యాక్సిస్ vsహెచ్డీఎఫ్సీ ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా..
కరోనా వేళ కస్టమర్లకు ఎస్బీఐ రిలీఫ్.. అదేంటంటే!!
మోదీ సర్కార్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి : సచిన్ పైలట్
జూన్ 20 తర్వాత స్పుత్నిక్ వీ టీకాల తొలి బ్యాచ్ రాక
రాజద్రోహానికి పరిమితులను సెట్ చేయాల్సిందే: సుప్రీంకోర్టు
ఆర్థిక ఇబ్బందులతో సర్రోగేట్ తల్లులుగా అమ్మాయిలు
రెండు వేర్వేరు డోసులు తీసుకుంటే ఎలా ? వ్యాక్సిన్ మిక్సింగ్పై త్వరలో స్టడీ