న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ అనుబంధ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెనక్కు తగ్గింది. డేటా ప్రొటెక్షన్ బిల్లు అమలులోకి వచ్చే వరకు తాము ప్రతిపాదించిన నూతన ప్రైవసీ పాలసీని స్వచ్ఛందంగా నిలిపేస్తామని ఢిల్లీ హైకోర్టుకు వెల్లడించింది. ఈ విధానాన్ని అంగీకరించని తమ ఖాతాదారులకు అందించే సేవల్లో పరిమితులు ఉండబోవని శుక్రవారం తెలిపింది.
వాట్సాప్ తన ప్రైవసీ పాలసీని ఈ ఏడాది జనవరిలో అప్డేట్ చేసింది. యూజర్ల సంభాషణలు, ఉత్తర ప్రత్యుత్తరాల సమాచారాన్ని తన పేరెంట్ సంస్థ ఫేస్బుక్తో షేర్ చేసుకోవడానికి వాట్సాప్ ప్రైవసీ పాలసీ అనుమతినిస్తుంది.
తమ నూతన ప్రైవసీ విధానాన్ని అంగీకరించని యూజర్లకు సేవలను పరిమితం చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో వాట్సాప్ యూజర్లు తమ వ్యక్తిగత గోప్యతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే వాట్సాప్ న్యూ ప్రైవసీ పాలసీపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తునకు ఆదేశించింది.
సీసీఐ దర్యాప్తును నిలిపేయాలని కోరుతూ ఫేస్బుక్, వాట్సాప్ యాజమాన్యాలు ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టాయి. కానీ ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ అందుకు నిరాకరించింది. దీంతో ఆ సంస్థలు డివిజన్ బెంచ్కు వెళ్లాయి.
దీనిని చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం విచారిస్తున్నది. ఈ సందర్భంగా డేటా ప్రొటెక్షన్ బిల్లు అమల్లోకి వచ్చే వరకు తన కొత్త ప్రైవసీ పాలసీని నిలిపేస్తామని న్యాయస్థానానికి వాట్సాప్ వెల్లడించింది.
ఈ విధానాన్ని యూజర్లు ఆమోదించాలని నిర్బంధించబోమని వాట్సాప్ తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే తెలిపారు. యూజర్లకు అప్డేట్ డిస్ప్లే కొనసాగిస్తామన్నారు.
13న రాష్ర్ట మంత్రి వర్గ సమావేశం
స్టంట్ మాస్టర్లను ఎవరూ నమ్మరు : మంత్రి జగదీశ్ రెడ్డి
కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి మళ్లీ చంద్రబాబు
2 డీజీ ఔషధ ఉత్పత్తికి మరో కంపెనీకి అనుమతి
అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టిన వృద్ధుడు.. వైరల్ వీడియో
ఫన్88 బ్రాండ్ అంబాసిడర్గా డారెన్ సామి…
నాకు డ్రా ఈజీగానే ఉంది కానీ..: పీవీ సింధు
ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నా ధరల మంటతో ఉక్కిరిబిక్కిరి!
అన్లాక్ ప్రక్రియతో అందుబాటులోకి వచ్చిన మూడోవంతు కొలువులు!
జర్మనీ ఆటో సంస్థలపై రూ.7,500 కోట్ల ఫైన్
లగ్జరీ కార్లంటే యమ క్రేజ్.. పలు వేరియంట్లపై మోజు
ఢిల్లీలో మళ్లీ రూ.47 వేల దిగువకు బంగారం..!