హైదరాబాద్: ఒలింపిక్స్లో ఈసారి మెడల్ ఆశలు రేపుతున్న వాళ్లలో బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ పీవీ సింధునే ముందు వరుసలో ఉంది. 2016 రియో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ గెలిచిన ఆమె.. ప్రస్తుతం వరల్డ్ చాంపియన్ కూడా. పైగా ఈసారి డ్రా కూడా తనకు అనుకూలంగా ఉన్నట్లు సింధు చెబుతోంది. హాంకాంగ్కు చెందిన వరల్డ్ 34వ ర్యాంకర్ అయిన ఎన్గన్ యి, ఇజ్రాయెల్ ప్లేయర్ సెనియా పొలికరోవా (58)లతో కలిసి సింధు గ్రూప్ జేలో ఉంది. ఈ ఇద్దరిపై ఆమెకు ఓటమెరుగని రికార్డు ఉంది. అయితే ఒలింపిక్ లెవల్లో ఎవరినీ తక్కువగా అంచనా వేయలేమని సింధు అన్నట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.
హాంకాంగ్ ప్లేయర్ ఎన్గన్ యి బాగా ఆడుతుంది. ఆమెతో మ్యాచ్ బాగుంటుంది అని వరల్డ్ నంబర్ 7 సింధు అభిప్రాయపడింది. ప్రతి ఒక్కరూ టాప్ ఫామ్లో ఉంటారు. నేను కూడా బాగా ఆడతానన్న నమ్మకం ఉంది. ప్రతి మ్యాచ్ ముఖ్యమే. ఒక్కో మ్యాచ్ లక్ష్యంగా ముందుకు సాగుతాను. ఇవి ఒలింపిక్స్. అంత ఈజీ కాదు. ప్రతి పాయింట్ ముఖ్యమే అని సింధు చెప్పింది. ఒలింపిక్స్లో భాగంగా ఈ నెల 24 నుంచి బ్యాడ్మింటన్ మ్యాచ్లు ప్రారంభమవుతాయి.