బ్రస్సెల్స్, జూలై 8: జర్మనీ ఆటో దిగ్గజ సంస్థలు దైమ్లర్, బీఎండబ్ల్యూ, ఫోక్స్వాగన్, ఆడీ, పోర్షేలపై గురువారం యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఏకంగా దాదాపు రూ.7,500 కోట్ల జరిమానా వేసింది. పర్యావరణానికి ముప్పు తెచ్చేలా కాలు ష్య కారక వాహనాలను తయారు చేస్తున్నారని ఫైన్ వేసింది. ఈ తరహా జరిమానాను, అలాగే ఇంత స్థాయిలో ఈయూ విధించడం ఇదే తొలిసారి.