సినిమా ఇండస్ట్రీలో రోజుకు కనీసం ఒకరిద్దరు ప్రముఖులు కరోనాకు బలి అవుతూ ఉండడం అత్యంత విషాదకరంగా మారింది. తాజాగా బాలీవుడ్ నిర్మాత రియాన్ ఇవాన్ స్టీపెన్ కరోనాతో కన్నుమూసాడు. కొద్ది రోజుల క్రితం ఈయన వైరస్ బారిన పడ్డాడు. దాంతో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఉన్నట్టుండి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఈ క్రమంలోనే మే 29న ఆయన ప్రాణాలు కోల్పోయారు. బాలీవుడ్ లో రియాన్ కు మంచి పేరు ఉంది. కియారా అద్వానీ హీరోయిన్ గా తెరకెక్కిన ఇందుకీ జవానీ చిత్రాన్ని ఈయనే నిర్మించారు.
అలాగే దేవి చిత్రానికి కూడా ఆయన నిర్మాతగా ఉన్నారు. రియాన్ మరణ వార్త తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో పనిచేసిన హీరోయిన్ కియారా అద్వానీ, హీరో వరుణ్ ధావన్, దియా మీర్జా, సీనియర్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ లాంటి స్టార్స్ సోషల్ మీడియాలో తమ సంతాపం ప్రకటించారు. ఇప్పటికైనా ఈ వైరస్ శాంతించాలని అందరూ కోరుకుంటున్నారు. మరోవైపు ఇంట్లో అందరూ క్షేమంగా ఉండాలి అంటూ కాంక్షిస్తున్నారు.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ బ్యానర్ యూవీ క్రియేషన్స్. ఈ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ అనే చిన్న బ్యానర్ ను స్థాపించి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తున్నారు. ఏక్ మినీ కథా ఈ బ్యానర్ నుంచి వచ్చిన మొదటి సినిమా. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఇక యూవీ కాన్సెప్ట్స్ భవిష్యత్తులో మరిన్ని సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది.
ఏక్ మినీ కథ చిత్రం చేసిన సంతోష్ శోభన్ మరో మూడు చిత్రాలకు సంతకం చేశాడట. మంచి హిట్టు కోసం ఎదురుచూస్తున్న సంతోష్ శోభన్ కు యూవీ కాన్సెప్ట్స్ లో మరో 3 సినిమాలు చేసే అవకాశం రావడం లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. ప్రభాస్-యూవీ క్రియేషన్స్ సంతోష్ శోభన్ కెరీర్ ను గాడిలో పెట్టేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాయి.
ఇవికూడా చదవండి..
షూటింగ్ ఎప్పుడు మొదలైనా..హరిహర వీరమల్లు వచ్చేదప్పుడే..!
ఒక్కో రోజు 18 రోజులు షూట్లో రాశీఖన్నా..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
ప్రభాస్ సినిమాలో 10మంది బాలీవుడ్ యాక్టర్లు..!
నిర్ణయం మార్చుకున్న మెహరీన్ !
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే రకుల్ యోగాసన్…!
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?