ఈ రోజుల్లో కరోనా కారణంగా చాలా సినిమాలు అనుకున్న సమయానికి విడుదల కావడం లేదు. షూటింగ్స్ అయిపోయినా కూడా విడుదలకు నోచుకోవడం లేదు. షూటింగ్ దశలో ఉన్నవేమో అలాగే ఆగిపోతున్నాయి. పెద్ద పెద్ద సినిమాలు కూడా రిలీజ్ డేట్స్ మార్చుకుంటున్నాయి. షూటింగ్స్ ఆపుకుని ఇంట్లో కూర్చున్నారు హీరోలు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా మాత్రం అనుకున్న టైమ్ కు వస్తుందని నిర్మాత AM రత్నం క్లారిటీ ఇచ్చారు. ఆ మధ్య ఖుషీ 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఆ సమయంలోనే హరిహర వీరమల్లు సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చాడు ఏఎం రత్నం. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియన్ సినిమా హరిహర వీరమల్లు పై అంచనాలు భారీగా ఉన్నాయి.
100 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు ఏఎం రత్నం. చారిత్రాత్మక నేపథ్యంతో పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి సినిమా ఇది. కోహినూర్ వజ్రం టైమ్ లో ఉండే కథతో క్రిష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో పవన్ బందిపోటుగా నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం కరోనా కారణంగా ఆగిపోయిందని తెలిపాడు ఏఎం రత్నం. నిన్న మొన్నటి వరకు క్వారంటైన్ లోనే ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు షూటింగ్ కి రావడానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ నిర్మాత క్లారిటీ ఇచ్చాడు. మరికొన్ని రోజుల్లో కొత్త షెడ్యూల్ ఉండబోతుంది. చివరిగా ఏప్రిల్ 6వ తేదీ వరకు షూటింగ్ జరిపామని..తర్వాత పవన్ కరోనా బారిన పడటం.. అలానే లాక్ డౌన్ కారణంగా కొత్త షెడ్యూల్ మొదలు పెట్టలేదని రత్నం తెలిపారు.
ప్రస్తుతం పవన్ సెట్ లో అడుగుపెట్టడానికి రెడీగా ఉన్నారని.. కొత్త షెడ్యూల్ లో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నటుడు అర్జున్ రామ్ పాల్ జాయిన్ అవుతారని చెప్పారు ఈయన. ఈ చిత్రంలో ఔరంగ జేబు పాత్రలో అర్జున్ రాంపాల్ కనిపిస్తారని చెప్పారు. షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టినా.. సినిమాను మాత్రం సంక్రాంతి 2022కి అనుకున్నట్లుగానే విడుదల చేస్తామని ధీమాగా చెప్తున్నాడు ఏఎం రత్నం. ఆయన కాన్పిడెన్స్ చూస్తుంటే నిజంగానే అనుకున్నది చేసేలాగే కనిపిస్తున్నారు. పైగా క్రిష్ కూడా తన సినిమాలను చాలా వేగంగా పూర్తి చేస్తాడు.
PlayUnmuteLoaded: 55.94%FullscreenCancel
PauseUnmuteLoaded: 13.83%Fullscreen
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే రకుల్ యోగాసన్…!
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
పవన్-రానా కోసం ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్..?