వేములవాడ: తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ గురించి విపరీతంగా చర్చ జరుగుతోందని, అయితే ఆర్ఆర్ఆర్ చిత్రం చేసిన వసూళ్లను మించి ఆర్ఆర్ ట్యాక్స్ ద్వారా వసూల్ చేస్తున్నట్లు ప్రధాని మోదీ(PM Modi) ఆరోపించారు. తెలుగు భాషలో ఇటీవల ఆర్ఆర్ఆర్ అనే చిత్రం రిలీజైందని, అయితే ఆ చిత్ర పెద్ద హిట్ అయ్యిందని, ఆ చిత్రం చేసిన కలెక్షన్ల కన్నా..ఆర్ఆర్ ఎక్కువ వసూళ్లు చేస్తున్నట్లు ప్రధాని ఆరోపించారు. ఆర్ఆర్ఆర్ చిత్రం వెయ్యి కోట్లు వసూల్ చేసిందని, కానీ ఆ మొత్తాన్ని కొన్ని రోజుల్లోనే ఆర్ఆర్ ట్యాక్స్ ద్వారా రాబట్టారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మోదీ తప్పుపట్టారు. ఆర్ఆర్ ట్యాక్స్ను రాహుల్ గాందీ, రేవంత్ రెడ్డి ట్యాక్స్గా అభివర్ణిస్తున్న విషయం తెలిసిందే.
#WATCH | In his address to a public meeting in Telangana’s Karimnagar, PM Narendra Modi says, “From Telangana to Delhi, there is a lot of discussion about ‘double R’ (RR) tax. A film named ‘RRR’ was released a few days back in the Telugu language, someone told me that ‘RR’ has… pic.twitter.com/gMCZZTCozh
— ANI (@ANI) May 8, 2024
వేములవాడలో ఇవాళ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ప్రధాని మోదీ బహిరంగ సభలో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో మూడవ దశ ముగిసిన తర్వాత.. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి మూడవ ఫ్యూజ్ ఎగిరిపోయిందన్నారు. నాలుగవ దశ ఎన్నికలు కూడా దగ్గరపడ్డాయని, ప్రజల దీవెనతో బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందన్నారు. ముందు దేశం అన్న లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోందన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఫ్యామిలీ ఫస్ట్ అన్న సిద్ధాంతం ఉందన్నారు. ఆ పార్టీలో అవినీతి కూడా ఎక్కువే అని మోదీ ఆరోపించారు.