ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ యువతిపై కెమికల్ పౌడర్ చల్లిన ఇద్దరు దుండగులు ల్యాప్టాప్ ఎత్తుకెళ్లారు. ముంబైలోని అంధేరికి చెందిన 26 ఏండ్ల యువతి యూపీఎస్సీ పరీక్షలకు (UPSC Aspirant) సన్నద్ధమవుతున్నది. ఈ క్రమంలో తన స్నేహితురాలికి చెందిన ల్యాప్టాప్ను ఇవ్వడానికి కల్యాణ్కు వెళ్తున్నది. కల్యాణ్ రైల్వే స్టేషన్లో దిగి నడుచుకుంటూ వెళ్తుండగా ఓ బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మొహంపై ఏదో రసాయన పౌడర్ చల్లారు.
దీంతో అది కళ్లలో పడటంతో మూసుకుపోయాయి. ఇదే అదనుగా ఆ యువతి వద్ద ఉన్న బ్యాగ్ను ఎత్తుకెళ్లిపోయారు. వెంటనే ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాగ్లో అందులో ల్యాప్టాప్ ఉన్నదని, దానిని తన స్నేహితురాలికి ఇవ్వడానికి అధేరి నుంచి కల్యాణ్కు వచ్చానని పేర్కొంది. పౌడర్ చల్లడంతో మొహంపై దద్దుర్లు వచ్చాయని, దుస్తులు కూడా కాలిపోయాయని తెలిపింది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దుండగులు కోసం గాలింపు చేపట్టారు.