హైదరాబాద్ : ఎండిపోతున్న పంటలకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కెనాల్స్ వెంట పాదయాత్ర చేపట్టారు. వరంగల్ జిల్లా మైలారం నుండి పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఎస్సారెస్పీ (SRSP) కెనాల్స్ వెంట పాదయాత్ర చేపట్టారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాలువలకు వెంటనే నీళ్లు విడుదల చేసి, రైతులను ఆదుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు అప్పుల పాలవుతున్నారని ఆవేదని వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఎండిపోయిన కాలువల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు పాదయాత్ర
వరంగల్ జిల్లా మైలారం నుండి పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని SRSP కెనాల్స్ వెంట పాదయాత్ర
కాలువలకు వెంటనే నీళ్లు విడుదల చేసి, రైతులను ఆదుకోవాలని డిమాండ్
పరిసరాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించిన ఎర్రబెల్లి దయాకర్ రావు pic.twitter.com/spiVWrzHaw
— Telugu Scribe (@TeluguScribe) August 17, 2026