Mumbai School | మహారాష్ట్ర ముంబైలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హమాస్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో పాలస్తీనావాసులకు (Palestine) అనుకూలంగా వ్యవహరించినందుకు ఓ ప్రిన్సిపాల్ను పాఠశాల యాజమాన్యం డిస్మిస్ చేసింది. ముంబైలోని విద్యావిహార్ (Vidyavihar) ప్రాంతంలో ఉన్న సోమయ్య పాఠశాల యాజమాన్యం (Somaiya school management) ఈ చర్యకు పాల్పడింది.
పాఠశాలలో పర్వీన్ షేక్ అనే మహిళ 12 ఏళ్లుగా పనిచేస్తోంది. ఏడేళ్ల కిందట ఆమె పాఠశాల ప్రిన్సిపాల్గా నియమితులయ్యారు. అయితే, ఇజ్రాయెల్ యుద్ధంలో గాజాలోని పాలస్తీనావాసులకు అనుకూలంగా సోషల్ మీడియాలో నెటిజన్లు పెట్టిన పోస్ట్లకు ఆమె ఇటీవలే లైక్ కొట్టడంతో యాజమాన్యం చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు ప్రిన్సిపాల్గా ఆమెను తొలగించింది.
తమ విద్యాసంస్థ విలువలకు అనుగుణంగా పర్వీన్ వ్యవహరించలేదని తెలిపింది. తాము నమ్మిన ఐకమత్యం, సమ్మళిత భావాలు ప్రమాదంలో పడరాదనే ఉద్దేశంతోనే ఆమెపై వేటు వేసినట్లు పాఠశాల యాజమాన్యం పేర్కొంది. భావ ప్రకటనా స్వేచ్ఛను గట్టిగా సమర్థిస్తామని. కానీ దాన్ని బాధ్యతతో ఉపయోగించుకోవాలని సూచించింది. ఈ మేరకు ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మీడియాకు నోట్ రిలీజ్ చేసింది.
మరోవైపు తనను తొలగించడం చట్టవిరుద్ధమని, ఇది చాలా అన్యాయమని పర్వీన్ పేర్కొంది. 12 ఏళ్లుగా విద్యాసంస్థ అభివృద్ధికి అంకితభావం, చిత్తశుద్ధితో పనిచేసినట్లు తెలిపింది. పాఠశాల నిర్ణయం రాజకీయ ప్రేరేపితమైనదిగా కనిపిస్తోందని అభిప్రాయపడింది. దేశ రాజ్యాంగం, న్యాయ వ్యవస్థలపై తనకు పూర్తి నమ్మకం ఉందని, యాజమాన్యం చర్యపై న్యాయ పోరాటం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
Our Media Statement on 7th May 2024 pic.twitter.com/CFgOS6oCvb
— Somaiya Vidyavihar (@SomaiyaTrust) May 7, 2024
Also Read..
Dog | లిఫ్ట్లో బాలికపై దాడి చేసిన శునకం.. వీడియో
PM Modi | వేములవాడ రాజన్న ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు