PM Modi | తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ ఆలయాన్ని (Vemulawada Temple) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దర్శించుకున్నారు. బుధవారం ఉదయం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం (Sri Raja Rajeshwara Swamy Devasthanam)లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న ప్రధానికి ఆలయ అధికారులు, పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం మోదీ కోడె మొక్కులు కూడా చెల్లించుకున్నారు.
ఇవాళ వేములవాడలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ప్రధాని మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ ఉదయం వేములవాడ వెళ్లి అక్కడ రాజన్న ఆలయాన్ని సందర్శించారు. మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇక కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కు మద్దతుగా ప్రధాని ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
#WATCH | Telangana: Prime Minister Narendra Modi offers prayers at Sri Raja Rajeshwara Swamy Devasthanam in Vemulawada, Karimnagar district. pic.twitter.com/jTbisq8qHg
— ANI (@ANI) May 8, 2024
#WATCH | Telangana: Prime Minister Narendra Modi offers prayers at Sri Raja Rajeshwara Swamy Devasthanam in Vemulawada, Karimnagar district. pic.twitter.com/Jcm0uvVlLg
— ANI (@ANI) May 8, 2024
Also Read..
Sanju Samson: సంజూ శాంసన్ క్యాచ్ ఔట్పై వివాదం.. నవజ్యోత్ సింగ్ సిద్దూ ఏమన్నాడంటే
Avinash Jolly | ఆప్కు గుడ్బై చెప్పిన అమృత్సర్ మాజీ మేయర్..!
Air India Express: సిక్ లీవ్లో ఉద్యోగులు.. రాత్రికి రాత్రే 70 విమానాలు రద్దు