Avinash Jolly : లోక్సభ ఎన్నికల వేళ పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) మరో ఎదురుదెబ్బ తగలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, అమృత్సర్ మాజీ మేయర్ అవినాష్ జోలి ఆప్కు గుడ్బై చెప్పారు. అనంతరం బీజేపీ నేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా జోలీ అనుచరులు కూడా పలువురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
పంజాబ్లో ఆమ్ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. భగవంత్ సింగ్ మాన్ ముఖ్యమంత్రిగా అక్కడ ప్రభుత్వం నడుస్తోంది. అధికార పార్టీలో ఉండి కూడా అవినాష్ జోలీ లోక్సభ ఎన్నికల వేళ రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది చర్చనీంయాశమైంది. జోలీ బీజేపీలో చేరిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Former Amritsar Deputy Mayor Avinash Jolly resigned from AAP and joined BJP, yesterday, in Amritsar. pic.twitter.com/FbR71bPsTf
— ANI (@ANI) May 8, 2024