Bibhav Kumar | ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్పై దాడి కేసు (assault case)లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సహాయకుడు బిభవ్ కుమార్ (Bibhav Kumar)ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సీఎం నివాసానికి వెళ్లిన పోలీసులు బిభవ్ను అదుపులోకి తీసుకుని వెనుక గేటు నుంచి తీసుకెళ్లారు. సీఎం నివాసంలో బిభవ్ కుమార్ తనపై దాడి చేశాడంటూ స్వాతి మలివాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వాతి వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన రెండు రోజుల తర్వాత బిభవ్ను అరెస్ట్ చేశారు.
సోమవారం నాడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేసినట్లు స్వాతి మలివాల్ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఘటనకు సంబంధించి పోలీసులకు చేసిన ఫిర్యాదులో స్వాతి మలివాల్ కీలక విషయాలను వెల్లడించారు. ‘నేను ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్లినప్పుడు బిభవ్ కుమార్ నాపైకి ఒక్కసారిగా దూసుకొచ్చి ఏడెనిమిది సార్లు బలంగా కొట్టాడు. నన్ను లాగేయడంతో టేబుల్కు నా తల తగిలి కింద పడిపోయాను. కావాలని నా చొక్కా పైకి లాగాడు. నా చొక్కా గుండీలు ఊడిపోయాయి. నా కడుపు, పొత్తి కడుపు, ఛాతిపై తన్నాడు. నేను పీరియడ్లో ఉన్నానని, నొప్పి భరించలేకపోతున్నానని చెప్పినా వినకుండా దాడి చేశాడు.’ అని స్వాతి ఫిర్యాదు చేశారు. మరోవైపు, సీఎం నివాసంలోకి అనధికారికంగా ప్రవేశించేందుకు మలివాల్ యత్నించారని, తనను దూషించారంటూ ఆమెపై బిభవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read..
Deve Gowda | నేరం రుజువైతే ప్రజ్వల్పై చర్యలు తీసుకోండి.. సెక్స్ స్కాండల్ కేసుపై దేవె గౌడ
AAP | మనీలాండరింగ్ కేసు.. నిందితుల జాబితాలో కేజ్రీవాల్, ఆప్