AAP | న్యూఢిల్లీ, మే 17: ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ శుక్రవారం మరో అనుబంధ చార్జిషీట్ను స్థానిక ప్రత్యేక కోర్టులో దాఖలు చేసింది. ఇందులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆయన నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీని నిందితుల జాబితాలో చేర్చింది. ఒక సిట్టింగ్ సీఎం, ఒక రాజకీయ పార్టీ మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కోవడం ఇదే తొలిసారి అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికి 18 మందిని అరెస్టు చేసిన ఈ కేసులో ఇది ఎనిమిదో చార్జిషీట్.
కేజ్రీవాల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్
తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని ఈ సందర్భంగా ఢిల్లీ సీఎంకు సూచించింది. ఆప్ అధ్యక్షుడిగా ఆ పార్టీ తరపున లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహించుకొనేందుకు సుప్రీంకోర్టు కేజ్రీవాల్కు ఈనెల 10న మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.