ప్రజాస్వామ్యం పతనావస్థలో ఉన్నప్పుడు, సర్కారీ వ్యవస్థలు సర్వం ధ్వంసమైనప్పుడు, జవాబుదారీతనం జాడేలేనప్పుడు, పారదర్శకత మృగ్యమైనప్పుడు, సామాన్యుడు తిరగబడితే ఎలా ఉంటుంది? దగా పడిన జనం దండు కడితే ఏం జరుగుతుంది? కేసీఆర్ చెప్పినట్టు.. ఇండియా రియాక్ట్స్!. స్ట్రెయిట్ ఫ్రమ్ ద స్ట్రీట్! గత నెల రోజులుగా అదే జరిగింది. నెత్తురుమండే, శక్తులు నిండే యువజనం.. ఒక్కొక్కరు అగ్నికణమై, రణమై కదిలారు.
ఎవరు వాళ్లంతా? దేశ యవనికపైకి మెరుపులా దూసుకొచ్చిన ఆ యువకిశోరాలెవరు? అధికారపక్షం అహంకారం ఒకవైపు… విపక్షం అస్త్రసన్యాసం మరోవైపు.. చేతగానిరీతిలో కాంగ్రెస్ చేతులెత్తేస్తే, ఆ బాధ్యతను భుజానికెత్తుకున్నవాళ్లు. జంతర్ మంతర్ వేదికగా భూకంపం పుట్టించారు. ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టారు. పైకి నీట్ ఫెయిల్యూర్ పై పోరాటంలా కనిపిస్తుండొచ్చుగానీ.. అది బీజేపీ సృష్టించిన పన్నెండేండ్ల నిర్బంధస్వామ్యపు ఉక్కపోత, ఊచకోత నుంచి.. 125 ఏండ్ల ముసలి కాంగ్రెస్ వైఫల్యాలపై పెల్లుబికిన అసహనం నుంచి పుట్టింది.
నవతరం గొంతు వినాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఆక్రోశాన్ని అణగదొక్కాలని ప్రయత్నించింది. కానీ వాళ్లు పతాకంలా పైకి లేచారు. నినాదంలా ప్రతిధ్వనించారు. లాఠీలకు బెదరలేదు. పెల్లెట్ గన్స్కు వెరవలేదు.. వడిసెలో రాళ్లు పెట్టి కొట్టినట్టు మీమ్స్ను వదిలారు. సోషల్మీడియాలో అగ్గి పుట్టించారు. యావత్ దేశాన్ని కదిలించారు. ఉక్కుపిడికిలి సడలకుండా ఉద్యమం నడిపారు. ప్రజా ఉద్యమాల్లో ఇది కొత్త వేరియంట్! సంప్రదాయ ఆందోళనలకు ఇది అవుటాఫ్ సిలబస్! విదేశీశక్తులు, పాకిస్థాన్ ఫండింగ్, మతవిభజన వంటి బీజేపీ రెడీమేడ్ ఆరోపణలను దాని పద్ధతిలోనే తిప్పికొట్టారు. జాతీయ జెండాలు చేతబూని లాఠీచార్జి నడుమ వందేమాతరం పాడారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినదించారు. ప్రశ్నించిన వాళ్ల నోరు నొక్కుతూ వచ్చిన మోదీ ప్రభుత్వానికి.. జెన్ జీని ఎలా కట్టడిచేయాలో అంతుచిక్కలేదు.
మొదటిసారి.. మోదీ కండ్లలో భయం కనిపించింది. కుర్చీ కదులుతున్న చప్పుడు వినిపించింది. ప్రాపగాండా అంతా ఫటేల్మని పేలిపోయినప్పుడు, వాట్సాప్ యూనివర్సిటీ నెరేటివ్స్ అంతా తునాతునకలైనప్పుడు, అధికార దర్పమంతా ఆత్మరక్షణలో పడినప్పుడు నిద్రపోని కండ్లల్లో ఆందోళన కనిపించింది. 12 ఏండ్లలో తొలిసారి ప్రజాగ్రహానికి తలొగ్గి కేంద్రమంత్రితో రాజీనామా చేయించాల్సి వచ్చింది.
న్యూఢిల్లీ, జూలై 25: దేశ యువతరం అసమాన పోరాటంతో అనుకున్నది సాధించింది. విద్యార్థుల ఉద్యమం తీవ్రం కావడంతో తొలుత బెట్టు చేసిన కేంద్రం చివరికి దిగి వచ్చింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వెంటనే దాన్ని ఆమోదించారు. ప్రహ్లాద్ జోషికి విద్యా శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ధర్మేంద్ర రాజీనామాతో బొద్దింకల సత్తా అందరికీ తెలిసిందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పేర్కొన్నారు.
ఇది ప్రజాస్వామ్య విజయమని పర్యావరణ ఉద్యమకారుడు, విద్యార్థుల ఉద్యమానికి నిరాహార దీక్షతో స్ఫూర్తి నిచ్చిన సోనమ్ వాంగ్చుక్ అభివర్ణించారు. ఇది విద్యార్థులు సాధించిన విజయమని విపక్షాలు, సెలబ్రిటీలు యువ త పోరాటాన్ని ప్రశంసించారు. తాజా పరిణామాలతో కేంద్రం వైఫల్యాలపై ప్రజల ఆగ్రహం మధ్య మూడవ విడత చర్చలు పారంభం కావడానికి కొన్ని గంటల ముందు ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ప్రధానికి రాజీనామా సమర్పించిన అనంతరం ఎక్స్ వేదికగా ప్రధాన్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను రాజీనామా చేశానని.

ప్రయోజనాలే ఎల్లప్పుడూ అత్యుత్తమమైనవని ఆయన పేర్కొన్నారు. తన రాజీనామా లేఖలో నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి మొదటి రోజు నుంచే తాను బాధ్యత వహించానని ఆయన పేర్కొన్నారు. గత పది రోజులుగా జరిగిన పరిణామాలు తనను కలవరపెట్టాయని చెప్పారు. జంతర్ మంతర్, దేశంలోని ఇతర పాంతాల్లో నెలకొన్న పరిస్థితుల నుంచి దేశ వ్యతిరేక శక్తులు ఎటువంటి లబ్ధి పొందకుండా చూడడటమే తన రాజీనామా నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు చట్టపరమైన చిక్కుల్లో పడకుండా వారు తమ చదువులు, కెరీర్పై దృష్టి సారించేలా చేయడానికి తాను రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు.
ధర్మేంద్ర పదవి నుంచి తప్పుకుంటారా లేదా అనే అంశంపై ప్రభుత్వ వర్గాలు శుక్రవారం సాయంత్రం వరకు ఊహగానాలకు ఆజ్యం పోస్తూనే ఉన్నాయి. దీనివల్ల మీడియా, నిరసనకారులు సందిగ్ధంలోనే ఉండిపోయారు. అయితే ఆందోళన ఊపందుకొని దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరిస్తుండటంతో ఆయన రాజీనామాను కోరడం తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వం భావించినట్లు సమాచారం. కాగా, ధర్మేంద్ర రాజీనామాను ప్రభుత్వం ఆమోదించనంత వరకు తదుపరి చర్చల్లో పాల్గొనడంలో అర్థం లేదని అంతకు ముందే సీజేపీ స్పష్టం చేసింది.
నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజ్, సీబీఎస్ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ ప్రకియలో అవకతవకలపై బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ, అలాగే ప్రభుత్వ పరీక్షల నిర్వహణలో సంస్కరణలు కోరుతూ జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్న తరుణంలో కేంద్ర విద్యా మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఈ నిరసనల తీవ్రత, విస్తృతి పట్ల, అలాగే విద్యాశాఖ మంతిగా ధర్మేంద్ర కొనసాగడంపై యువతలో పెరుగుతున్న అసహనం పట్ల కేందం తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఈ సుదీర్ఘ ఆందోళన ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న విశ్వసనీయతను ముఖ్యంగా కీలక మద్దతు వర్గంగా పరిగణిస్తున్న తొలిసారి ఓటు వేసేవారు, యువ ఓటర్లలో దెబ్బ తీయడం ప్రారంభించిందని రాజకీయ పరిశీలకులు పేర్కొన్నారు. ప్రధాన్ రాజీనామా డిమాండ్ ఈ ఉద్యమం అంతటా ప్రధాన అంశంగా నిలిచింది. ఆయన పదవి నుంచి తప్పుకున్న తర్వాతే అర్థవంతమైన చర్చలు సాధ్యమవుతాయని ఆందోళనకారులు పట్టుపట్టారు.
నిరసనలకు ప్రజల మద్దతు పెరుగుతుండటంతో ఈ వ్యవహారం ఎన్నికల పరమైన పరిణామాలకు దారి తీయవచ్చని అధికార పార్టీ ఆందోళన చెందినట్టు సమాచారం. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ అశాంతిని ఎన్నికలు జరుగనున్న ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ర్టాల్లో బీజేపీకి ఒక రాజకీయ ప్రతికూల అంశంగా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ర్టాల్లో యువత ఓట్లు నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నాయని అంచనా. మరింత రాజకీయ నష్టాన్ని నివారించడానికి, ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఈ వివాదాన్ని త్వరగా పరిష్కరించడం అత్యవసరమని శనివారం రాజకీయ వర్గాల్లోని చాలామంది భావించారు.